Sexval Herasment: పోకిరీ మీద కేసు పెట్టిన మహిళ, మహిళకు నిప్పంటించిన కేటుగాడి ఫ్యామిలీ !
లక్నో/ చెన్నై: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న మహిళ మీద ఓ కామాంధుడు కన్ను పడింది. మహిళను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. పోకిరిగాడి చేష్టలు చూసిచూడనట్లు ఉండిపోయిన మహిళ అతనికి వీలైనంత దూరంగా ఉండటం మొదలు పెట్టింది. రానురాను రోర్డు రోమియో ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఇంట్లో విషయం చెబితే గొడవలు ఎక్కువ అవుతాయని, అసలే జులాయిగాడు ఏం చేసినా చేస్తాడు అని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. మహిళ సైలెంట్ గా ఉండటంతో ఆ కామాంధుడు ఇంకా రెచ్చిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి వీధిలోకి రావాలంటే భయపడే విధంగా వాడి చేష్టలు తారాస్థాయికి చేరిపోయాయి. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న కామాంధుడు ఆమె ఇంటిలోకి దూరిపోయాడు. మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. చివరికి కామాంధుడు కోరిక తీర్చుకుని ఎస్కేప్ అయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. మా కొడుకు మీద కేసు పెడుతావా అంటూ రెచ్చిపోయిన అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టిన మహిళ మీద కిరోసిన్ పోసి నిప్పంటించడం కలకం రేపింది.
Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్, ప్రియురాలికి మూడో ప్రియుడు, రెండో వాడు !
నేరాలు ఘోరాలకు ఫేమస్
ఉత్తరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలు ఏ రైంజ్ లో జరుగుతాయో భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పనవసరం లేదు. పాతకక్షల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు, మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు. పోలీసు కేసులు అవుతాయనే భయంతో అమాయకుల మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా వారిని దారుణంగా చంపేస్తున్నారని ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి.
మహిళ మీద కన్ను వేసిన రోడ్డు రోమియో
ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలోని కుల్ పషా ప్రాంతంలో 30 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. మహిళ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జితేంద్ర సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే కేటుగాడు నివాసం ఉంటున్నాడు. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న మహిళ మీద జితేంద్ర అనే కామాంధుడు కన్ను పడింది. మహిళను ఎలాగైనా లొంగదీసుకోవాలని జితేంద్ర అనేక ప్రయత్నాలు చేశాడు. పోకిరిగాడు జితేంద్ర చేష్టలు చూసిచూడనట్లు ఉండిపోయిన ఆ మహిళ అతనికి వీలైనంత దూరంగా ఉండటం మొదలు పెట్టింది.
అసలే కేటుగాడు అని భయం
రానురాను రోర్డు రోమియో జితేంద్ర ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఇంట్లో విషయం చెబితే గొడవలు ఎక్కువ అవుతాయని, అసలే జులాయి గాడు జితేంద్ర ఏం చేసినా చేస్తాడు అంటూ ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. మహిళ సైలెంట్ గా ఉండటంతో కామాంధుడు జితేంద్ర ఇంకా రెచ్చిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి వీధిలోకి రావాలంటే భయపడే విధంగా జితేంద్ర చేష్టలు తారాస్థాయికి చేరిపోయాయి.
ఏకంగా ఇంట్లో దూరిపోయి ?
ఇటీవల ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని తెలుసుకున్న కామాంధుడు జితేంద్ర ఆమె ఇంటిలోకి దూరిపోయాడు. మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి జితేంద్ర విఫలయత్నం చేశాడు. చివరికి కామాంధుడు జితేంద్ర అతని కోరిక తీర్చుకుని ఎస్కేప్ అయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు జితేంద్ర మీద కేసు నమోదు చేశారు.
కేసు పెట్టిందని సజీవదహనం చెయ్యడానికి ప్లాన్
జితేంద్ర మీద అత్యాచారం కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టిన మహిళ మీద రగిలిపోయారు. మహిళ ఇంటి దగ్గరకు వెళ్లిన జిజేంద్ర కుటుంబ సభ్యులు బాధితురాలి శరీరం మీద కిరోసిన్ పోసి నిప్పంటించారు. బాధితురాలు కుటుంబ సభ్యులు మంటలు అదుపు చేసి బాధితురాలిని జాన్సీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
స్టేట్ మెంట్ ఇచ్చిన బాధితురాలు
తన మీద అత్యాచారం చేసిన నిందితుడి కుటుంబ సభ్యులు నన్ను చంపడానికి నిప్పంటించారని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చిందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి మహేంద్ర ప్రతాప్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. మహిళకు నిప్పంటించిన కేసులో నిందితుడి తల్లిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి మహేంద్ర ప్రతాప్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.