ఆయనతో సంబంధం: సునంద, థరూర్లది మూడో పెళ్లే!
ఈమె తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ పిఎన్ దాస్ 1983లో ఆర్మీ నుంచి రిటైరయ్యారు. శ్రీనగర్లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆమె తర్వాత కాలంలో ఉద్యోగరీత్యా దుబాయ్కి చేరుకున్నారు. అక్కడ టెకాం అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డైరెక్టర్గా వ్యవహరించారు.
శశిథరూర్ను వివాహం చేసుకోకముందు సునంద పుష్కర్కు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఆమె మొదటి భర్త సంజయ్ రైనా అనే కాశ్మీరీ. ఆ వివాహం విఫలమవడంతో విడాకులు తీసుకుని కేరళకు చెందిన వ్యాపారవేత్త సుజిత్ మీనన్ని పెళ్లి చేసుకున్నారు. 1997లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. సుజిత్తో సునందకు ఒక కుమారుడు ఉన్నాడు.
కేరళలోని పాలక్కాడ్లో థరూర్ల వంశానికి చెందిన శశిథరూర్ లండన్లో జన్మించారు. ఆయన మొదటి భార్య తిలోత్తమ పాత్రికేయురాలు. వారిద్దరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ పిల్లల పేర్లు ఇషాన్, కనిష్క్. తర్వాత శశిథరూర్ ఆమెకు విడాకులిచ్చి కెనడాకు చెందిన క్రిస్టా గైల్స్ను వివాహం చేసుకున్నారు. ఆయన యూఎన్లో పని చేస్తున్నప్పుడు ఆమె పరిచయం. ఆ బంధం కూడా విఫలం కావడంతో సునందను మూడో వివాహం చేసుకున్నారు.