షీనా హత్య: ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం, సీరియస్
హైదరాబాద్: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలై, స్వయానా ఆమె తల్లి అయిన ఇంద్రాణి ముఖార్జియా (43) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఇంద్రాణి భారీ మోతాదులో ట్యాబ్లెట్లు మింగడంతో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆమెను హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి జేజే ఆస్పత్రిలో ఇంద్రాణికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంద్రాణికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని, మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.

ఇంద్రాణి మత్తుమందులు అధికంగా వాడినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు.సాయంత్రం వరకు కూడా ఇంద్రాణి ముఖార్జియా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. డిప్రెషన్ను అధిగమించడానికి వాడే గుళికలను ఆమె ఎక్కువ మోతాదులో తీసుకుందని వైద్యులు అంటున్నారు.
జైలు అధికారులను ఇచ్చిన గుళికలను ఆమె నిలువ చేసుకుని మింగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలోంచి సాంపిల్స్ తీసి పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. ఎపిలప్సీ గుళికలు ఆమె వద్ద ఉండి ఉంటాయని, వాటిని ఆమె ఒకేసారి మింగి ఉంటుందని జెజె ఆస్పత్రి డీన్ టిపి లహనే అంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications