షీలాదీక్షిత్ యూ టర్న్, గిఫ్ట్.. మంత్రిపై ప్రధాని ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను అనలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ శనివారం అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి షీలా దీక్షిత్ మద్దతు పలికినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై షీలా వివరణ ఇచ్చారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను చెప్పలేదన్నారు. తగిన సంఖ్యాబలం ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే చెప్పానని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు మంచివని, ఎందుకంటే అవి ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో బీజేపీ ఉంటే, అది ఢిల్లీకి మంచిదే అని ఆమె అప్పుడు అభిప్రాయపడ్డారు. వాటిపై దుమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు.
మంత్రిపై మోడీ మండిపాటు
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరుడి పైన మండిపడ్డారు. పాత్రికేయులకు బహుమతులు ఇచ్చారన్న కారణంగా ఆయన పైన మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆ మంత్రి ఇచ్చే వివరణను కూడా ఆయన తిరస్కరించారు. ఆ మంత్రి తన శాఖ పైన వార్తలు రాసిన విలేకరులకు బహుమతులు ఇచ్చారని తెలిసిన ప్రధాని ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆయన పైన ఆఘ్రహం వ్యక్తం చేశారు. అవి మన విధానాలకు విరుద్ధమని చెప్పారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications