జకీర్ని చంపితే రూ.15లక్షల రివార్డు: హుస్సేనీ టైగర్స్
లక్నో: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్కు అన్ని దారులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హుస్సేనీ టైగర్స్ అనే బృందం.. జకీర్ను చంపితే రూ.15లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.
ఆ బృందం అధ్యక్షుడు సయ్యద్ కల్బే హుస్సేన్ నఖ్వీ మాట్లాడుతూ.. 'అతడు(జకీర్) నాయక్ కాదు.. ఖల్నాయక్(ఒక విలన్'. ఇస్లాం మత ప్రవక్తను అవమానిస్తున్నాడు. అతడ్ని చంపిన వారికి నగదు బహుమతి అందిస్తాం. అతడొక కాఫిర్' అని పేర్కొన్నారు.

ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ కల్బె సాదిఖ్ కుమారుడే హుస్సేన్ నఖ్వీ. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం జకీర్ నాయక్ ప్రసంగాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదుల్లో ఒకరు జకీర్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందినట్లు వార్తలు రావడమే అందుకు కారణం. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం జకీర్ ప్రసంగాలను ప్రసారం చేసే టీవీ ఛానెల్ను నిషేధించింది. భారత ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జకీర్ ప్రసంగాలపై దర్యాప్తు జరుపుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications