వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయ సలహా కోరుతాం: తెలంగాణ బిల్లుపై షిండే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ తిరస్కరించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం ఏమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అంటుండగా, న్యాయసలహా కోరుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అంటున్నారు.

రాష్ట్ర అసెంబ్లీనుంచి తిరిగి వచ్చిన తెలంగాణ బిల్లుపై న్యాయ సలహా కోరతామని సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారం రాత్రి తనను కలిసిన కొంతమంది మీడియా ప్రతినిధులతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు.

తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అని ప్రశ్నించగా.. తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని ఆయన అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానంపై అటార్నీ జనరల్ సలహా తీసుకుంటామని షిండే తెలిపారు.

అటార్నీ జనరల్ ఇచ్చే సలహా చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. వచ్చే నెల 4వతేదీన జరిగే మంత్రుల బృందం(జీవోఎం) సమావేశంలో అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పారు.

English summary
Union home minister Sushil kumar Shinde said that legal opinion will be taken on Telangana bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X