హిందూత్వను శివసేన వీడలేదు-ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలకు ఉద్ధవ్ థాక్రే కౌంటర్
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో నెలకొన్న సంక్షోభం ముదురుతోంది. తాజా పరిణామాలపై ఇవాళ సీఎం ఉద్ధవ్ థాక్రే ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూత్వ విషయంలో షిండే చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన ప్రసంగంలో శివసేన ఎప్పుడూ హిందుత్వం నుండి విడిపోలేదని అన్నారు. "మా ఊపిరిలో హిందుత్వ ఉంది. హిందుత్వానికి ఎవరు ఏం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు" అని ఉద్ధవ్ థాకరే అన్నారు, "నేను బాలాసాహెబ్ హిందుత్వను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను." అంటూ ఉద్ధవ్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

అంతకు ముందు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే శివసేన హిందూత్వ రాజకీయాల్ని వదిలేస్తోందని ఆరోపించారు. అందుకే తాను శివసేనలోని ఇతర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. హిందూత్వను బలంగా విశ్వసించే బీజేపీతో కలిసి ముందుకు వెళ్దామని ఉద్ధవ్ కు ప్రతిపాదించారు. అయితే ఉద్ధవ్ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో శివసేన కూటమిని చీల్చి మరీ బీజేపీకి మద్దతిచ్చేందుకు షిండే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ధాక్రే షిండే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications