బీహార్లో ఓడిన బిజెపిపై శివసేన ఘాటు వ్యాఖ్యలు
ముంబై: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది చితకలపడిన బీజేపీకి మిత్రపక్షం అయిన శివసేన తనదైన శైలిలో విమర్శలు చేసింది. బీహార్ లో బీజేపీని గొయ్యిలో పాతిపెట్టారని, అది బయటకు రావడానికి చాల కాలం పడుతుందని విమర్శించింది.
శివసేనకు చెందిన సామ్నా సంపాదకీయంలో నితీశ్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తింది. అదే విధంగా బీజేపీ మీద తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ అన్ని విషయాలను చాల తేలికగా తీసుకుని చివరికి చితకలపడుతుందని ఎద్దేవ చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను తేలికగా తీసుకున్న బీజేపీ చివరికి షాక్ గురైయ్యిందని గుర్తు చేశారు. బీహార్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం అని గుర్తు చేసింది. నరేంద్ర మోడీ వర్సెస్ నితీశ్ కుమార్ కు ముఖాముఖి పోరు జరిగిందని అంటున్నది.

డబ్బు, రాజకీయ వ్యూహాలు, భారీ ప్యాకేజీల ప్రకటనలు చేసినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్ర పక్షాలకు 60 సీట్లు మించలేదని, బీహార్ ప్రజలు తగిన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసింది. నిరాడంబర ప్రచారం, నిజాయితీ ఇమేజ్ తో నితీశ్ తన అధికారాన్ని నిలబెట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అనాగరిక బాష, బూటకపు హామీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పని చెయ్యలేదని చెప్పింది. బీహార్ లో మహాకూటమి గెలిస్తే పాకిస్థాన్ లో టపాసులు పేలాయే, లేదో మాకు తెలియదని శివసేన వ్యాఖ్యానించింది. మొత్తం మీద మిత్రపక్షమైన బీజేపీకి శివసేన గట్టి షాక్ ఇచ్చింది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications