శివసేన కథ ఆరు నెలల్లో క్లోజ్, మేము చేసిన పెద్ద తప్పు అదే, బీజేపీదే హవా, కేంద్ర మంత్రి ఫైర్!
న్యూఢిల్లీ/బెంగళూరు: శివసేనతో కలిసి మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి చాల పెద్ద తప్పు చేశామని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలల్లో శివసేన అడ్రస్ లేకుండా పోతుందని, అలాంటి పార్టీ ఒకటుండేది అని మహారాష్ట్ర ప్రజలు త్వరలోనే చెప్పుకుంటారని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదని, కచ్చితంగా ఇప్పటికి బీజేపీ సొంత బలంతో అధికారంలో ఉండేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శివసేనకు నీతి లేదు
మహారాష్ట్రలో శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన ఎన్నికల్లో పోటీ చేసిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ గుర్తు చేశారు. అయితే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి ఎదురు తిరిగిందని, శివసేనకు కొంచెం కూడా నీతి లేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ విమర్శించారు.

శివసేనకు అధికార దాహం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించిందని, శివసేన కేవలం 56 స్థానాల్లో విజయం సాధించిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ గుర్తు చేశారు. శివసేన కంటే రెండింతల ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీతో గొడవ పెట్టుకున్న శివసేన చాల పెద్ద తప్పు చేసిందని, న్యాయంగా మేమే (బీజేపీ) అధికారంలోకి రావడానికి శివసేన సహకరించి ఉండాలని కేంద్ర మంత్రి సదానంద గౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శివసేన కథ క్లోజ్
మహారాష్ట్రలో శివసేన పని అయిపోయిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో శివసేన పార్టీ గల్లంతు అవుతోందని, అలాంటి పార్టీ గతంలో ఉండేది అని మహారాష్ట్ర ప్రజలు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద శివసేన పార్టీ గల్లంతు అవుతోందని కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం వెనుక చాల పెద్ద కథే ఉంటోందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

మా సత్తా చూపిస్తాం
కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ తీరుపై విసుగు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, అందుకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. రాజీనామా చేసిన అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారని, కచ్చితంగా వారందరూ విజయం సాధించి మళ్లీ ఎమ్మెల్యేలు అవుతారని కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, కర్ణాటకలో బీజేపీ పూర్తి కాలం అధికారంలో ఉంటోందని కేంద్ర మంత్రి సదానంద గౌడ ధీమా వ్యక్తం చేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications