Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Student: సెలవుల్లో స్కూల్ కు పిలిపించారు. 5వ తరగతి విద్యార్థి ఎలా చనిపోయాడు ?

చెన్నై/ తుత్తుకూడి: స్కూల్ కు వెళ్లిన అబ్బాయి అక్కడ సాటి విద్యార్థులతో కలిసి కొంతసేపు ఆడుకున్నాడు. తరువాత స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు చెప్పిన పనులు విద్యార్థులు చేశారు. స్కూల్ ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలు మొత్తం తొలగించిన విద్యార్థులు తరువాత ఇంటికి బయలుదేరాు. ఆ సందర్బంలో గాయపడిన అబ్బాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది.

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని ధోప్పూర్ ప్రాంతంలో శివపెరుమాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శివపెరుమాల్ కుమారుడు అజయ్ కుమార్ అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల సందర్బంగా స్కూల్ కు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి.

 Shock: A fifth class student who went to school died suspiciously in Tamil Nadu.

పాఠశాల ఆవరణలో పెరిగిన మొక్కలను తొలగించేందుకు ప్రధానోపాధ్యాయురాలు ఐదవర తరగతి ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులను పాఠశాలకు పిలిచారు. అజయ్‌ కుమార్‌తో సహా కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి పని ముగించుకుని సింగిల్‌లేన్‌ రోడ్డు మీదుగా పాఠశాల ఎదుటకు వచ్చారు. ఆ సమయంలో అజయ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఐదవ తరగతి విద్యార్థి అజయ్ కుమార్ తలకు బలమైన దెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో అజయ్ కుమార్ ను తుత్తుకూడిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అజయ కుమార్ మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలిసే వరకు మృతదేహాన్ని తీసుకోమని అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అజయ్ కుమార్ ఎలా చనిపోయాడు, సెలవులు ఉన్న సమయంలో విద్యార్థులను స్కూల్ ఎందుకు పిలిచారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+