చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Student: సెలవుల్లో స్కూల్ కు పిలిపించారు. 5వ తరగతి విద్యార్థి ఎలా చనిపోయాడు ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తుత్తుకూడి: స్కూల్ కు వెళ్లిన అబ్బాయి అక్కడ సాటి విద్యార్థులతో కలిసి కొంతసేపు ఆడుకున్నాడు. తరువాత స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు చెప్పిన పనులు విద్యార్థులు చేశారు. స్కూల్ ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలు మొత్తం తొలగించిన విద్యార్థులు తరువాత ఇంటికి బయలుదేరాు. ఆ సందర్బంలో గాయపడిన అబ్బాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది.

Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని ధోప్పూర్ ప్రాంతంలో శివపెరుమాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శివపెరుమాల్ కుమారుడు అజయ్ కుమార్ అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల సందర్బంగా స్కూల్ కు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి.

 Shock: A fifth class student who went to school died suspiciously in Tamil Nadu.

పాఠశాల ఆవరణలో పెరిగిన మొక్కలను తొలగించేందుకు ప్రధానోపాధ్యాయురాలు ఐదవర తరగతి ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులను పాఠశాలకు పిలిచారు. అజయ్‌ కుమార్‌తో సహా కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి పని ముగించుకుని సింగిల్‌లేన్‌ రోడ్డు మీదుగా పాఠశాల ఎదుటకు వచ్చారు. ఆ సమయంలో అజయ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?

ఐదవ తరగతి విద్యార్థి అజయ్ కుమార్ తలకు బలమైన దెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో అజయ్ కుమార్ ను తుత్తుకూడిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అజయ కుమార్ మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలిసే వరకు మృతదేహాన్ని తీసుకోమని అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అజయ్ కుమార్ ఎలా చనిపోయాడు, సెలవులు ఉన్న సమయంలో విద్యార్థులను స్కూల్ ఎందుకు పిలిచారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Shock: A fifth class student who went to school died suspiciously in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X