lawyer: జిల్లా కోర్టులో లాయర్ ను కాల్చి చంపేశారు. రివాల్వర్ అక్కడే వదిలేసి ఎస్కేప్, మాజీ సీఎం ఫైర్ !
లక్నో/షాజహాన్ పూర్: జిల్లా కోర్టులో కేసు వాయిదాలకు హాజరుకావడానికి ప్రజలు హాజరైనారు. కేసులు వాదించడానికి, తమ కక్షిదారులు కేసు విచారణకు హాజరుకాలేదని కేసులు వాయిదాలు అడగడానికి లాయర్లు హడావిడిగా తిరుగుతున్నారు. ఎవరిపనుల్లో వారు బిజీగా ఉన్నారు. కేసు వాయిదాలకు నిందితులను పిలుచుకుని పోలీసులు ఆ కోర్టుకు వచ్చారు. ఇలా సామాన్య ప్రజలు, కొందరు రాజకీయ నాయకులు, లాయర్లు, పోలీసు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. జిల్లా కోర్టు మూడు అంతస్తులో తుపాకి కాల్పులు వినపడ్డాయి. మూడో అంతస్తులో ఉన్న ఓ న్యాయవాది హత్యకు గురైనాడని వెలుగు చూడటం కోర్టు ఆవరణంలో కలకలం రేపింది. లాయర్ ను హత్య చేసిన నిందితులు అతన్ని హత్య చెయ్యడానికి ఉపయోగించిన పిస్తోల్ అక్కడే వదిలేశారు. లాయర్ ను చంపిన హంతకులు అక్కడి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయా ?, అసలు ప్రభుత్వం ఉందా ? అంటూ మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏకిపారేయడం హాట్ టాపిక్ అయ్యింది.

కోర్టులో అందరూ బిజీబిజీ
ఉత్తరప్రదేశ్ లోని షహజహాన్ జిల్లా కోర్టులో సోమవారం (అక్టోబర్ 18వ తేది) ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. షహజహాన్ జిల్లా కోర్టులో కేసు వాయిదాలకు హాజరుకావడానికి ఆ జిల్లాలోని కేసులకు హాజరౌతున్న ప్రజలు హాజరైనారు. కేసులు వాదించడానికి, తమ కక్షిదారులు కేసు విచారణకు హాజరుకాలేదని కేసులు వాయిదాలు అడగడానికి లాయర్లు కోర్టు చుట్టూ హడావిడిగా తిరుగుతున్నారు.

మూడో అంతస్తులో లాయర్ దారుణ హత్య
షహజహాన్ జిల్లా కోర్టు మూడో అంతస్తులో న్యాయవాది భూపేంద్ర సింగ్ ఉన్నాడు. లాయర్ భూపేంద్ర సింగ్ తో సోమవారం ఆయనతో కేసులు వాదించుకుంటున్న కొంతమంది కలిశారు. షహజహాన్ జిల్లా కోర్టు మూడు అంతస్తులో తుపాకి కాల్పులు వినపడ్డాయి. మూడో అంతస్తులో ఉన్న న్యాయవాది భూపేంద్ర సింగ్ హత్యకు గురైనాడని వెలుగు చూడటం జిల్లా కోర్టు ఆవరణంలో కలకలం రేపింది.

పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు, కాని ?
లాయర్ భూపేంద్ర సింగ్ హత్యకు గురైన సమయంలో జిల్లా కోర్టు ఆవరణంలో పోలీసు అధికారులు ఉన్నారు. లాయర్ భూపేంద్ర సింగ్ ను హత్య చేసిన నిందితులు అతన్ని హత్య చెయ్యడానికి ఉపయోగించిన పిస్తోల్ అక్కడే వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. లాయర్ భూపేంద్ర సింగ్ ను చంపిన హంతకులు అక్కడి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది.

ఒక్కరు కూడా చూడలేదు.... సాక్షం చెప్పలేదు
కోర్టు ఆవరణంలో తాము కేసు విచారణకు హాజరుకావడానికి వచ్చామని, లాయర్ భూపేంద్ర సింగ్ ను హత్య చేసిన సమయంలో మేము హంతకులను చూడలేదని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో బ్యాంకులో ఉద్యోగం చేసిన భూపేంద్ర సింగ్ గత నాలుగు సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

ప్రభుత్వం ఉందా ? లేదా, మాజీ సీఎం ఫైర్
భూపేంద్ర సింగ్ వాదిస్తున్న కేసుల్లోని ప్రత్యర్థులు అతన్ని హత్య చేసిన ఉంటారని అందరూ అనుమనాం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అసలు ప్రభుత్వం ఉందా ?, రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయా ?, ప్రజలకు రక్షణ ఉందా ?, కోర్టులో లాయర్ ను కాల్చి చంపినా ఈ ప్రభుత్వం నిద్రలేవడం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏకిపారేయడం హాట్ టాపిక్ అయ్యింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications