Shock: ఆసుపత్రిలో బాలిక శవం కొరికి తినేసిన కుక్క, సింపుల్ గా విచారణకు ఆదేశం, వీడియో వైరల్ !
లక్నో/ సంభోల్: ప్రమాదంలో మరణించిన బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లి మూడు గంటలు అయినా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆసుపత్రి స్ట్రెచర్ మీద బాలిక మృతదేహాన్ని అలాగే వదిలేయడంతో దారుణం జరిగింది. బాలిక మృతదేహానికి రక్తం కారుతుండటంతో ఓ కుక్క అక్కడికి వెళ్లి స్ట్రెచర్ మీద ఉన్న బాలిక శవాన్ని కొరికి తినింది. బాలిక మృతదేహాన్ని కుక్క కొరికి తింటున్న సమయంలో తీసిన వీడియో వైరల్ అయ్యింది. నాలుక కొరుక్కున్న ఆరోగ్య శాఖ అధికారులు సింపుల్ గా విచారణకు ఆదేశించారు.
Beautiful wife: ఎవరు వాళ్లు ? ఎందుకొస్తున్నారు ?, భార్య గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసిన భర్త !
ప్రమాదంలో బాలిక మృతి
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదంలో బాలిక ప్రాణాలు పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె మృతదేహాన్ని సంభాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లోని స్ట్రెచర్ మీద నుంచి బాలిక శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరండాలోకి తీసుకెళ్లి స్ట్రెచర్ తో పాటు శవాన్ని అక్కడే వదిలేశారు.
శవాన్ని కొరికి తినేసిన కుక్క
ఆసుపత్రిలోకి బాలిక శవాన్ని తీసుకెళ్లి సుమారు మూడు గంటలు అయినా అక్కడి సిబ్బంది శవానికి పోస్టుమార్టుం చెయ్యడంలో నిర్లక్షం చేశారు. ఆసుపత్రిలోకి వరండాలో ఓ పక్క స్ట్రెచర్ మీద శవమై పడిఉన్న బాలిక శరీరం నుంచి రక్తం కారుతుండటంతో అటువైపు ఓ కుక్క వెళ్లింది. ఆ సమయంలో స్ట్రెచర్ మీద ఉన్న బాలిక శవాన్ని ఓ వైపు ఆ కుక్క కొరికి తినింది.
వీడియో వైరల్
స్ట్రెచర్ మీద బాలిక శాన్ని కుక్క కొరికి తింటున్న సమయంలో అదే ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి దానిని అతని మొబైల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్షం కారణంగా ఓ బాలిక శవాన్ని కుక్క కొరికి తింటున్నదని, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం తీరు ఇప్పుడు స్పష్టంగా కనపడుతోందని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు.
దుమ్మెత్తిపోసిన ప్రజలు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల మీద ప్రజలు దుమ్మెత్తిపోశారు. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితేనే పట్టించుకోని సిబ్బంది ఇక మనుషులు చనిపోతే ఏం పట్టించుకుంటారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి అమితా సింగ్ విచారణకు ఆదేశించామని స్థానిక మీడియాకు సింపుల్ గా చెప్పారు. తన కుమార్తె ప్రాణాలు పోయాయని తాము ఆవేదన చెందుతున్నామని, చివరికి ఆమె శవాన్ని కుక్కలకు వదిలేశారని బాలిక తండ్రి ఆసుపత్రి వర్గాల మీద మండిపడ్డారు.