Shock: ప్రభుత్వ స్కూల్ లోని బాత్ రూమ్ లో పురిటి బిడ్డ, స్కూల్ లో ఏం జరుగుతోంది, టీచర్లు హడల్ !

చెన్నై/తిరుచ్చి: ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ప్రతిరోజు విద్యార్థులు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. స్కూల్ లోని బాత్ రూమ్ లు ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ లో అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు, టాయిలెట్ లు ఉన్నాయి. ఇదే టాయిలెట్ లో పురిటి బిడ్డ చిక్కడంతో అందరూ హడలిపోయారు.

అయితే ప్రభుత్వ స్కూల్ లోని టాయిలెట్ లో పురిటిబిడ్డ చిక్కడం కలకలం రేపింది. తమిళనాడులోని తిరుచ్చిలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ స్కూల్ లో వందలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుతున్నారు. ఈ స్కూల్ కు చాలా సంవత్సరాల చరిత్ర ఉంది.

Shock: New born found dead inside toilet of govt school near Trichy in Tamil Nadu.

స్కూల్ లోని టాయిలెట్ లు శుభ్రం చెయ్యడానిి అక్కడ పని చేసే మహిళ వెళ్లింది. ఆ సందర్బంలో టాయిలెట్ లో పురిటి బిడ్డ కనపడటంతో ఆమె హడలిపోయింది. వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్ కు, టీచర్లకు సమాచారం ఇచ్చింది. టాయిలెట్ లో చిక్కిన బిడ్డను స్కూల్ టీచర్లు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే పురిటి బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఎవరు పురిటి బిడ్డను వదిలేసి వెళ్లారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్ ఆవరణంలోనే మహిళ బిడ్డకు జన్మనిచ్చిందని, టాయిలెట్ దగ్గర కొన్ని సాక్షాలు చిక్కాయని పోలీసులు అంటున్నారు. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి సంటఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. కేసు విచారణలో ఉందని తిరుచ్చి పోలీసులు తెలిపారు. ప్రభుత్వ స్కూల్ లో పురిటి బిడ్డ శవమై కనిపించడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+