యూపీ ఎన్నికల వేళ యోగీకి మరో షాక్-ఉన్నావ్ లో మరో దళిత బాలిక దారుణ హత్య
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తున్నా రాష్ట్రంలో పరిస్ధితులు మాత్రం ఆయనకు అంత అనుకూలంగా కనిపించడం లేదు. తాజాగా ఉన్నావ్ లో మరో యువతి దారుణ హత్యకు సంబంధించి బయటపడిన శవ పంచనామా నివేదికలో అంశాలు యోగీకి నిద్రలేకుండా చేసేలా ఉన్నాయి.
యూపీలోని ఉన్నావ్ లో రెండు నెలల క్రితం ఓ 22 ఏళ్ల దళిత యువతి కనిపించకుండా పోయింది. ఆమె తల్లితండ్రులు స్ధానిక పోలీసు స్టేషన్ లో తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమె కోసం గాలించకుండా పారిపోయి ఉంటుందంటూ తల్లితండ్రులపై ఎదురుదాడికి దిగారు. చివరకు చేసేది లేక తల్లితండ్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. చివరికి రెండు రోజుల క్రితం ఆమె శవమై కనిపించింది. యూపీలో ఓ మాజీ మంత్రి కుమారుడి గెస్ట్ హౌస్ లో ఆమె మృతదేహం కుళ్లిన స్ధితిలో కనిపించింది. దీంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో దొరికిన దళిత యువతి మృతదేహం శవపరీక్షలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆమె మెడ విరిగిందని తేలింది. శవపరీక్ష నివేదిక కూడా ఆమెపై దాడి జరిగిందని, ఆమె తలపై రెండు గాయాలు గమనించినట్లు పేర్కొంది. మహిళ కనిపించకుండా పోయినా పోలీసులు తన ఫిర్యాదులను పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. మీ అమ్మాయి ఇంటి నుండి పారిపోయిందని అధికారులు చెప్పారని ఆమె తెలిపింది. ఆమె త్వరలో తిరిగి వస్తుందని, ఎస్పీని కలవడానికి కూడా అధికారులు అనుమతించలేదని వెల్లడైంది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే యూపీలో ఎన్నికల వేళ బీజేపీ అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో ఉన్నావ్ లో దళిత బాలిక హత్యపై ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉన్నావ్ లో మరో బాలిక హత్య తీవ్ర కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications