గుండెను పిండేసే విషాదం.. ఒంటిపై లేఖ రాసి మహిళ ఆత్మహత్య!
Dowry Harassment: ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఓ ఇల్లాలు వరకట్న వేధింపులకు బలైంది. అత్తింటి వారి ధనదాహానికి తన ప్రాణాలను కట్నంగా సమర్పించుకుంది. తన శరీరంపై సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్లో వరకట్న వేధింపుల కారణంగా 28 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమె తన శరీరంపై సూసైడ్ నోట్ రాసి పెట్టింది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. మనీషా అనే మహిళ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.
పెన్నుతో తన చేయి, కాళ్లు, కడుపుపై రాసిన లేఖలో.. ఆమె తన భర్త కుందన్, అతని కుటుంబం నుంచి ఎదుర్కొంటున్న వేధింపుల వల్ల పడుతున్న బాధను వ్యక్తపరిచింది. "నా మరణానికి కుందన్, అతని కుటుంబం బాధ్యులు" అని హిందీలో రాసి ఉంది. మనీషా తన అత్తమామలను తన మరణానికి కారణమని ఆరోపిస్తూ ఒక వీడియో కూడా తీసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ క్లిప్లో మనీషా ఏడుస్తూ.. తన భర్త, అతని తల్లి, తండ్రి, సోదరుడు వరకట్నం కోసం తనను నిరంతరం ఎలా వేధించారో వివరించింది. ఆమె ప్రకారం.. తన కుటుంబం పెళ్లి కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసినా, ఇప్పటికే బుల్లెట్ బైక్ను వరకట్నంగా ఇచ్చినా, వారు పదేపదే కారు, భారీ మొత్తంలో డబ్బు అడిగారు. తన అత్తమామలు, భర్త అప్పుడప్పుడు తనను కొట్టేవారని.. బలవంతంగా గర్భస్రావం కూడా చేయించారని ఆమె ఆరోపించింది. వరకట్న డిమాండ్లకు లొంగకపోవడంతో తన అత్తమామలు తనను విద్యుదాఘాతంతో చంపడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొంది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మనీషాకు 2023లో నోయిడా నివాసి అయిన కుందన్తో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత ఆమె అత్తమామలు వరకట్నం కోసం ఆమెపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. పెరుగుతున్న మానసిక వేధింపుల కారణంగా ఆ మహిళ జులై 2024లో తన పుట్టింటికి వెళ్లింది. ఆమె చనిపోవడానికి నాలుగు రోజుల ముందు, మనీషా కుటుంబం ఆమెకు తన భర్త నుంచి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేశారు. అయితే తన అత్తమామలు వరకట్న వస్తువులను తిరిగి ఇచ్చే వరకు విడాకుల పత్రాలపై సంతకం చేయనని ఆమె చెప్పిందని అధికారులు తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications