వైరల్ వీడియో: రైలులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్..
సమాజంలో రోజురోజుకూ మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొంతమంది మానవ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. మహిళలు బస్సు, రైలు ప్రయాణాలు చేసేటప్పుడు, రద్దీ ప్రదేశాల్లో అసభ్యంగా తాకుతూ పబ్లిక్ లో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తమిళనాడులో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
పోలీస్ ఉద్యోగం చేస్తూ మహిళల్ని రక్షించాల్సింది పోయి.. వారితోనే బహిరంగ ప్రదేశాల్లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం సంచలనం రేపుతోంది. రైలులో కోయంబత్తూరు వెళ్తున్న ఓ లా విద్యార్థిపై ఓ పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె పక్కన కూర్చుని నిద్రపోయినట్టుగా నటిస్తూ ఆమె ఛాతిని తాకే ప్రయత్నం చేశాడు. పోలీస్ చేష్టలను గమనించిన ఆ యువతి.. తన ఫోన్ లో అందుకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేసింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు.. పోలీస్ పై మండిపడుతున్నారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని కామెంట్స్ పెడుతున్నారు.
ரயிலில் மாணவியிடம் காவலர் செய்த செயல்#ssnews #dailynews #newsupdates #trains #police #student pic.twitter.com/JBP9iXTFyc
— SS News Digital (@SSNEWSDigital) December 24, 2025
యువతి ఇచ్చిన సమాచారం మేరకు రైలు ఆరక్కోణం రైల్వే స్టేషన్ కు రాగానే అప్పటికే స్టేషన్ లో సిద్ధంగా ఉన్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షేక్ మహ్మద్ గా గుర్తించారు. అతడ్ని ఆర్ఎస్ పురం రైల్వే స్టేషన్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.

మరోవైపు సెప్టెంబర్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ బస్సులో 17 ఏళ్ల విద్యార్థినిపై ఓ ప్రభుత్వ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ అధికారి చేష్టలను తోటి ప్రయాణికులకు చెప్పగా వారు అతడ్ని పోలీసులకు అప్పగించారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై మహిళలు ప్రయాణాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వీరిలో మార్పు రావడం లేదు.












Click it and Unblock the Notifications