సిద్దరామయ్యకు మెడకు వేలాడుతున్న కొత్త వివాదం..
బెంగుళూరు : కర్ణాటక సీఎం సిద్దరామయ్యను వివాదాలు వెంటాడుతున్నాయి. బెంగుళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ) కు స్టివార్డ్ నియామకం విషయంలో రుణాల రూపేనా సిద్దరామయ్యకు, స్టివార్డ్ గా నామినేట్ అయిన వివేకానందకు మధ్య లావాదేవీలు జరిగాయన్న ఆరోపణ ఆయన తాజా వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
బెంగుళూరు టర్ఫ్ క్లబ్ స్టివార్డ్ గా ఎల్.వివేకానంద నామినేషన్ దాఖలు చేయగా, ఆయనతో ఆర్థిక సిద్దరామయ్య ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారని ఎస్.భాస్కరన్ అనే ఓ సామాజిక కార్యకర్త ఆరోపిస్తున్నారు. దీనిపై పలు ఆధారాలను కూడా సేకరించిన భాస్కరన్ ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

స్టివార్డ్ గా నామినేట్ చేసినందుకు గాను రూ. 1.3 కోట్ల రుణాన్ని వివేకానంద దగ్గరి నుంచి తీసుకున్నారని భాస్కరన్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న భాస్కరన్, దీనికి సంబంధించిన పలు సాక్ష్యాలను గవర్నర్ కి పంపించినట్టుగా సమాచారం.
కాగా, దీనిపై స్పందించిన వివేకానంద మాత్రం భాస్కరన్ ఆరోపణలను కొట్టిపారేశారు. సీఎంకి తనకు మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేసిన ఆయన, తనను నామినేట్ చేసినందుకు సిద్దరామయ్య తన వద్ద నుంచి రుణం పొందారన్న ఆరోపణలను ఖండించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications