హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సిక్కులు ఆందోళన చేపట్టారు. హస్తినలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళనకు దిగారు. ఇటీవల పాకిస్థాన్లో ఓ సిక్కు యువతులను మత మార్పిడికి ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఇవాళ పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద సిక్కులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
పాకిస్థాన్లో ఉన్న సిక్కు కుటుంబాలకు తగిన రక్షణ కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పుల్వామా దాడి, జమ్ము కశ్మీర్ విభజన తర్వాత దాయాది దేశాల మధ్య ఉగ్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిక్కులు మత మార్పాడి చేయడాన్ని సిక్కులు తీవ్రంగా తప్పుపడుతూ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పాకిస్థాన్ హై కమిషనర్కు మెమోరాండం ఇచ్చేందుకు సిక్కు ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

సిక్కుల ఆందోళన నేపథ్యంలో పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా భద్రతా బలగాలను మొహరించారు. అయితే బారికేడ్లను తోసివేసి .. పాకిస్థాన్కు వ్యతిరేకంగా సిక్కులు నినాదాలు చేశారు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్లో ఇద్దరు సిక్కు యువతులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. దీనిని భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications