అగ్గిపెట్టె జేబులోనే ఉంటుంది: అశోక్ గజపతిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోక్గజపతిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు అగ్గిపెట్టె తన దగ్గర ఉంటుందని, తననెవరూ చెక్ చేయరని అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు.
అగ్గిపెట్టె తీసుకెళ్లడం తప్పేమీ కాదని అంటూనే అగ్గిపెట్టెతో విమానాన్ని హైజాక్ చేయలేమని ఆయన పేర్కొన్నారు. తాను పౌర విమాన యానాల మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను తనిఖీ చేయడం ఆపేశారని ఆయన చెప్పారు.

మంత్రిని కాబట్టి సిబ్బంది తన దేహాన్ని తడిమి చూడబోరని, దీంతో లైటర్స్నూ అగ్గిపెట్టేలను కాపాడుకోగలనని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అగ్గిపెట్టే ప్రమాదానికి కారణమైన సంఘటనలు ఇప్పటి వరకూ లేవని ఆయన అన్నారు. తాను విపరీతంగా పొగ తాగుతానని, దాంతో తాను అగ్గిపెట్టెలను దగ్గర ఉంచుకుంటానని, ఇంతకు ముందైతే వాటిని తీసేసుకునేవారని, ఇప్పుడు మంత్రిని కాబట్టి తనకు ఆ సమస్య లేకుండా పోయిందని ఆయన అన్నారు. అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన చర్చ సాగుతోంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఆశోక్ గజపతిరాజు దాదాపుగా వివాదరహితుడైన నాయకుడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరడంతో తొలిసారే అశోక్ గజపతిరాజుకు మంత్రి పదవి దక్కింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications