ఆటో-బస్సు ఢీ, 6గురు విద్యార్థులు మృతి: వాహనాలు తగలబెట్టారు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఆగ్రహించిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని శివాన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది.
శివాన్ జిల్లాలో స్కూల్ ఆటో రిక్షా, మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విద్యార్థులు ఉన్న వాహనం బోల్తా పడింది. పలువురికి గాయలయ్యాయి. ఆరుగురు విద్యార్థులు మృతి చెందారని సమాచారం. దీంతో అగ్రహంతో రగిలిపోయిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆటో రిక్షాలు కోచింగ్ క్లాసుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మరోవైపు, ఆసుపత్రిలో వైద్యులు లేరని గాయపడ్డ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం ేచశారు.












Click it and Unblock the Notifications