వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆటో-బస్సు ఢీ, 6గురు విద్యార్థులు మృతి: వాహనాలు తగలబెట్టారు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఆగ్రహించిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని శివాన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది.
శివాన్ జిల్లాలో స్కూల్ ఆటో రిక్షా, మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విద్యార్థులు ఉన్న వాహనం బోల్తా పడింది. పలువురికి గాయలయ్యాయి. ఆరుగురు విద్యార్థులు మృతి చెందారని సమాచారం. దీంతో అగ్రహంతో రగిలిపోయిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆటో రిక్షాలు కోచింగ్ క్లాసుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మరోవైపు, ఆసుపత్రిలో వైద్యులు లేరని గాయపడ్డ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం ేచశారు.
Comments
English summary
Six students killed in road accident at Siwan in Bihar, angry locals torch ambulances over absence of doctors
Story first published: Monday, April 20, 2015, 11:25 [IST]