Sketch: అందమైన అక్కాచెల్లెలు, భర్తలతో విడాకులు, ఒకేసారి ఇద్దర్నీ చంపేసి ఎస్కేప్, పక్కాస్కెచ్ !
బెంగళూరు: అందంగా ఉన్న అక్కాచెల్లికి (ఒకే తల్లి బిడ్డలు) వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. వివిద కారాణాల వలన అక్కా, ఆమె చెల్లి వారివారి భర్తలతో విడాకులు తీసుకున్నారు. అక్కాచెల్లి కలిసి జీవించడం మొదలు పెట్టారు. కాటన్ మిల్ లో పని చేస్తున్న అక్కాచెల్లి ఊరి బయట అద్దె ఇల్లు తీసుకుని ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. ఇంట్లో ఉన్న అక్కాచెల్లిని ఒకేసారి దారుణంగా చంపేసిన నిందితులు ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఇంటి నుంచి దుర్వాసనరావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కాచెల్లి హత్యకు గురైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. అక్కాచెల్లి హత్య కేసులో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కలేదు.

బళ్లారి సిస్టర్స్
కర్ణాటకలోని బళ్లారి జిల్లా కూడ్లగి తాలుకాలోని చినకహళ్ళి గ్రామంలో గౌరమ్మ అలియాస్ గౌరి (34), రాధమ్మ అలియాస్ రాధ (32) అనే అక్కాచెల్లి నివాసం ఉంటున్నారు. అందంగా ఉన్న అక్కాచెల్లి గౌరమ్మ, రాధమ్మకు గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. ఇప్పుడు గౌరమ్మ, రాధమ్మ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. వివిద కారాణాల వలన రాధామ్మ ఆమె భర్తతో, గౌరి ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు.

ఒకే చోట పని చేస్తున్న అక్కాచెల్లెలు
బళ్లారి జిల్లా నుంచి దావణగెరె చేరుకున్న రాధమ్మ, గౌరమ్మ ఆంజనేయ కాటన్ మిల్లులో పని చెయ్యడం మొదలుపెట్టారు. కాటన్ మిల్లులో పని చెయ్యడంతో మిల్లుకు దగ్గరగా ఉంటుందని దావణగెరె నగరంలో కాకుండా ఆ నగరం శివార్లలో అద్దె ఇల్లు తీసుకున్న రాధమ్మ, గౌరమ్మ ఇద్దరు అక్కడ నివాసం ఉంటున్నారు. గౌరమ్మ, రాధమ్మ సిస్టర్స్ కుటుంబ సభ్యులు బళ్లారి జిల్లాలోని సొంత ఊర్లో నివాసం ఉంటున్నారు.

చాలా అందంగా ఉంటున్న సిస్టర్స్
చూడటానికి ఎర్రగా, పొడవుగా చాలా అందంగా ఉన్న రాధమ్మ, గౌరమ్మ మీద కొందరు కామాంధుల కళ్లుపడ్డాయని సమాచారం. సాయంత్రం కాటన్ మిల్లులో పని ముగించుకుని ఇంటికి వెళ్లి కొంత సేపటి తరువాత గౌరమ్మ, రాధమ్మ అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్లి వచ్చేవాళ్లు. బయటకు నుంచి ఇంటికి వెళ్లిన తరువాత నాలుగు రోజులు అయినా స్థానికులకు రాధమ్మ, గౌరమ్మ కనపడలేదు. 2021 జులై 30వ తేదీన రాధమ్మ, గౌరమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి దావణగెరె గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పక్కాస్కెచ్ వేసి ఒకేసారి అక్కాచెల్లిని చంపేశారు
దావణగెరె గ్రామీణ పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా రాధమ్మ, గౌరమ్మ శవమై కనిపించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధమ్మ, గౌరమ్మ హత్యకు గురైనారని వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే రాధమ్మ, గౌరమ్మ హత్యకు గురైనారని, శవాలు కుళ్లిపోవడంతో దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగు చూసిందని దావణగెరె పోలీసు అన్నారు.

హంతకులు మాత్రం చిక్కలేదు
రాధమ్మ, గౌరమ్మ నివాసం ఉంటున్న ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ? అని పోలీసులు ఆరా తీశారు. రాధమ్మ, గౌరమ్మ మొబైల్ నెంబర్ ఫోన్లకు ఎవరెవరు ఫోన్లు చేశారు ?, వీరిలో ఎవరికైనా అక్రమ సంబంధం ఉందా ?, మాజీ భర్తల్లో ఎవరైనా హత్య చేశారా ? అంటూ పోలీసులు అనేక కోణాల్లో ఆరా తీశారు. అందంగా ఉన్న అక్కాచెల్లి రాధమ్మ, గౌరమ్మ ఒకే రోజు దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో దావణగెరెలో కలకలం రేపింది. అయితే అక్కాచెల్లి జంట హత్యల కేసుల్లో నిందితులు ఇప్పటి వరకు పోలీసులకు మాత్రం చిక్కలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications