Sketch: అందమైన అక్కాచెల్లెలు, భర్తలతో విడాకులు, ఒకేసారి ఇద్దర్నీ చంపేసి ఎస్కేప్, పక్కాస్కెచ్ !

బెంగళూరు: అందంగా ఉన్న అక్కాచెల్లికి (ఒకే తల్లి బిడ్డలు) వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. వివిద కారాణాల వలన అక్కా, ఆమె చెల్లి వారివారి భర్తలతో విడాకులు తీసుకున్నారు. అక్కాచెల్లి కలిసి జీవించడం మొదలు పెట్టారు. కాటన్ మిల్ లో పని చేస్తున్న అక్కాచెల్లి ఊరి బయట అద్దె ఇల్లు తీసుకుని ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. ఇంట్లో ఉన్న అక్కాచెల్లిని ఒకేసారి దారుణంగా చంపేసిన నిందితులు ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఇంటి నుంచి దుర్వాసనరావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కాచెల్లి హత్యకు గురైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. అక్కాచెల్లి హత్య కేసులో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కలేదు.

బళ్లారి సిస్టర్స్

బళ్లారి సిస్టర్స్

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కూడ్లగి తాలుకాలోని చినకహళ్ళి గ్రామంలో గౌరమ్మ అలియాస్ గౌరి (34), రాధమ్మ అలియాస్ రాధ (32) అనే అక్కాచెల్లి నివాసం ఉంటున్నారు. అందంగా ఉన్న అక్కాచెల్లి గౌరమ్మ, రాధమ్మకు గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. ఇప్పుడు గౌరమ్మ, రాధమ్మ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. వివిద కారాణాల వలన రాధామ్మ ఆమె భర్తతో, గౌరి ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు.

 ఒకే చోట పని చేస్తున్న అక్కాచెల్లెలు

ఒకే చోట పని చేస్తున్న అక్కాచెల్లెలు


బళ్లారి జిల్లా నుంచి దావణగెరె చేరుకున్న రాధమ్మ, గౌరమ్మ ఆంజనేయ కాటన్ మిల్లులో పని చెయ్యడం మొదలుపెట్టారు. కాటన్ మిల్లులో పని చెయ్యడంతో మిల్లుకు దగ్గరగా ఉంటుందని దావణగెరె నగరంలో కాకుండా ఆ నగరం శివార్లలో అద్దె ఇల్లు తీసుకున్న రాధమ్మ, గౌరమ్మ ఇద్దరు అక్కడ నివాసం ఉంటున్నారు. గౌరమ్మ, రాధమ్మ సిస్టర్స్ కుటుంబ సభ్యులు బళ్లారి జిల్లాలోని సొంత ఊర్లో నివాసం ఉంటున్నారు.

 చాలా అందంగా ఉంటున్న సిస్టర్స్

చాలా అందంగా ఉంటున్న సిస్టర్స్

చూడటానికి ఎర్రగా, పొడవుగా చాలా అందంగా ఉన్న రాధమ్మ, గౌరమ్మ మీద కొందరు కామాంధుల కళ్లుపడ్డాయని సమాచారం. సాయంత్రం కాటన్ మిల్లులో పని ముగించుకుని ఇంటికి వెళ్లి కొంత సేపటి తరువాత గౌరమ్మ, రాధమ్మ అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్లి వచ్చేవాళ్లు. బయటకు నుంచి ఇంటికి వెళ్లిన తరువాత నాలుగు రోజులు అయినా స్థానికులకు రాధమ్మ, గౌరమ్మ కనపడలేదు. 2021 జులై 30వ తేదీన రాధమ్మ, గౌరమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి దావణగెరె గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పక్కాస్కెచ్ వేసి ఒకేసారి అక్కాచెల్లిని చంపేశారు

పక్కాస్కెచ్ వేసి ఒకేసారి అక్కాచెల్లిని చంపేశారు

దావణగెరె గ్రామీణ పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా రాధమ్మ, గౌరమ్మ శవమై కనిపించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధమ్మ, గౌరమ్మ హత్యకు గురైనారని వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే రాధమ్మ, గౌరమ్మ హత్యకు గురైనారని, శవాలు కుళ్లిపోవడంతో దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగు చూసిందని దావణగెరె పోలీసు అన్నారు.

 హంతకులు మాత్రం చిక్కలేదు

హంతకులు మాత్రం చిక్కలేదు


రాధమ్మ, గౌరమ్మ నివాసం ఉంటున్న ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ? అని పోలీసులు ఆరా తీశారు. రాధమ్మ, గౌరమ్మ మొబైల్ నెంబర్ ఫోన్లకు ఎవరెవరు ఫోన్లు చేశారు ?, వీరిలో ఎవరికైనా అక్రమ సంబంధం ఉందా ?, మాజీ భర్తల్లో ఎవరైనా హత్య చేశారా ? అంటూ పోలీసులు అనేక కోణాల్లో ఆరా తీశారు. అందంగా ఉన్న అక్కాచెల్లి రాధమ్మ, గౌరమ్మ ఒకే రోజు దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో దావణగెరెలో కలకలం రేపింది. అయితే అక్కాచెల్లి జంట హత్యల కేసుల్లో నిందితులు ఇప్పటి వరకు పోలీసులకు మాత్రం చిక్కలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+