వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూల్: రైలులో ఎక్కువ సేపు పడుకోవడం కుదరదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వేశాఖ కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చింది. రైళ్ళలో చిల్లర జగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది. బెర్తుల్లో నిద్రపోయే వేళలను కుదించింది.

రిజర్వుడ్ బోగీల్లో క్రింది, మధ్య బెర్త్‌ల ప్రయాణికులు త్వరగా పడుకోవడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటోందని, ఈ విధంగా ఎక్కువసేపు నిద్ర పోవడాన్ని నిరోధించాలని నిర్ణయించింది.

రైల్వే బోర్డు గత నెల 31న విడుదల చేసిన ఓ సర్క్యులర్ ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మాత్రమే బెర్తుల్లో పడుకోవచ్చురాత్రి 10 గంటల కన్నా ముందు, ఉదయం ఆరు గంటల తర్వాత సీట్లలో ఇతరులు కూర్చోవడానికి అవకాశం ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Sleeping Time Cut By An Hour For Train Passengers In New Rule

అయితే గర్భిణులు, అనారోగ్యవంతులు, దివ్యాంగులు ఈ వేళల కన్నా ఎక్కువ సేపు నిద్రపోవాలనుకుంటే, వారికి ఇతర ప్రయాణికులు సహకరించాలని పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రింది, మధ్య బెర్తుల్లో ప్రయాణికులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులు నిద్రపోయేందుకు అనుమతి ఉంది.

అయితే ఈ నిర్ణయం అమల్లో రైళ్ళలో ఏ రకమైన పరిస్థితి ఉంటుందోననే ఆందోళన కూడ లేకపోలేదు.

English summary
If you a frequent train traveller, you must have witnessed those tiresome fights over berths and stretched sleep time. In its effort to provide a comfortable travel to its passengers and put an end to those unnecessary quarrels that break out due to oversleeping passengers on different berths, the Railways has decided to reduce the official sleeping hours in its trains by an hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X