ఊరట:సిఈసీ ఆదేశాల నిలుపుదల, స్మృతి ఇరానీకి కోర్టు ఊరట
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. ఆమె చదివిని పదవతరగతి, 12వ,తరగతుల రికార్డులను పరిశీలించాలని సిబిఎస్ ఈ కి అనుమతిస్తూ కేంద్ర సమాచార హక్కు కమీషనర్ శ్రీధర్ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస
న్యూఢిల్లీ:కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. ఆమె చదివిని పదవతరగతి, 12వ,తరగతుల రికార్డులను పరిశీలించేందకు అనుమతించాలని సిబిఎస్ఈకి కేంద్ర సమాచారహక్కు కమీషననర్ శ్రీధర్ ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేసింది.
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విధ్యార్హతల వివరాలు వ్యక్తిగత సమాచారం కాదని కేంద్ర సమాచార హక్కు కమీషనర్ ఎం. శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఆమె చదివిన విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించేందకు అనుమతివ్వాలని సిబీఎస్ ఈ ని ఆదేశించారు శ్రీధర్.

అయితే కేంద్ర సమాచార కమీషనర్ శ్రీధర్ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఈ విషయమై విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెల్లడించింది.
గతంలో కూడ ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిగ్రీ విధ్యార్హతల గురించి కేంద్ర సమాచార కమీషనర్ శ్రీదర్ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు.తొలుత ప్రధానమంత్రి విద్యార్హతలపై వివాదం తలెత్తింది.అయితే స్మృతి ఇరానీ విషయంలో కూడ అదే జరిగింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆమెకు ఊరటనిచ్చింది.












Click it and Unblock the Notifications