సారీ, తమిళనాడుకు నీళ్లివ్వలేం: సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటక
బెంగళూరు/న్యూఢిల్లీ: కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. తమిళనాడుకు అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపింది.
'క్షమించండి. తమిళనాడుకు నీరు ఇవ్వలేం. ఒకవేళ తమిళనాడుకు నీరివ్వాలని మాకున్నా.. మా వద్ద అంత నీటి నిల్వ లేదు. కావేరీ బేసిన్లోకి నాలుగు కాల్వల నుంచి మొత్తం 9టీఎంసీల నీరు వస్తోంది. ఆ 9టీఎంసీలు మాకు తాగడానికి, పంట పొలాలకు సరిపోవడం లేదు' అని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు.

అంతేగాక, 'మాకు నీటి కొరత ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నాం. ఈ విషయం గురించి సుప్రీంకు వివరణ ఇస్తాం' అని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు.
తమిళనాడులో కావేరీ యాజమాన్య బోర్డు నిర్వహించాలని కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మే 4నాటికి ముసాయిదాను అందించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా.. ముసాయిదాను ప్రవేశపెట్టలేకపోయారని కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు మే8కి వాయిదా వేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications