బీజేపీ అజేయం ఏమీ కాదు- ఇలా ఓడించొచ్చు-అఖిలేష్ యాదవ్ కొత్త ఫార్ములా ఇదే..
దేశవ్యాప్తంగా మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గెలిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. దీన్ని అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ పాత మిత్రుల్ని, శత్రువుల్ని కూడా కలుపుకుని పోతున్నాయి. ఇదే క్రమంలో ప్రధాన విపక్షం కాంగ్రెస్ తో విభేదిస్తున్న ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెరపైకి కొత్త ఫార్ములా తెచ్చారు.
దేశంలో బీజేపీ అజేయశక్తి ఏమీ కాదని, ఆ పార్టీని ఓడించడానికి ఓ ఫార్ములా ఉందని అఖిలేష్ యాదవ్ ఇవాళ వెల్లడించారు. జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించే శక్తి పీడీఏ కూటమికి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. పీడీఏలో పీ పిఛ్ లే (వెనుకబడిన వర్గాలు), డీ అంటే దళితులు, ఏ అంటే అల్పసంఖ్యాక వర్గాలంటూ అఖిలేష్ తెలిపారు. ఈ ముగ్గురు కలిస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఉమ్మడి ప్రతిపక్షం విషయంలో మాత్రం అఖిలేష్ స్పందించలేదు. అయితే ఉత్తరప్రదేశ్ కోసం తన ఏకైక నినాదం మాత్రం "80ని ఓడించండి, బిజెపిని తప్పించడం" అని అఖిలేష్ వెల్లడించారు.
పెద్ద జాతీయ పార్టీలు మాకు మద్దతు ఇస్తే యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతుంది అని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అంటే పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ తన పార్టీ ఎస్పీకి మద్దతిస్తే బీజేపీని యూపీలో ఓడించడం కష్టం కాదనేది ఆయన ఆలోచన. అయితే ఉమ్మడి కూటమి విషయంలో ముందుకు రాని అఖిలేష్ విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications