రేప్లకు పూర్తి బాధ్యత మహిళలదే: ఎస్పీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
హమీర్పూర్: ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ సమాజ్వాది పార్టీకి చెందిన మరో నేత మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు మహిళలే కారణమంటూ హమీర్పూర్ ఎమ్మెల్యే శివచరణ్ ప్రజాపతి బుధవారం వ్యాఖ్యానించారు.
‘అత్యాచారాల్లో మహిళలదేమీ తప్పు లేదనడం సరికాదు. రేప్లకు పూర్తి బాధ్యత వారిదే' అని చెప్పారు. మహిళలు పాల్గొన్న సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అలాగే గర్భస్రావాలు, వరకట్న వేధింపులలోనూ మహిళల పాత్ర తక్కువేమీ కాదని పేర్కొన్నారు. అదే వేదికపై ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ జరీనా ఉస్మానీ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెంటనే సర్దుకున్న ఎమ్మెల్యే శివచరణ్.. తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. కాగా, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినరోజే రాష్ట్రంలో ముగ్గురు యువతులపై అత్యాచారం జరిగింది. ఎస్పీ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజాప్రతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరస్తులను ప్రోత్సహించినట్లవుతుందని బిజెపి అధికారి ప్రతినిధి విజయ్ బహదూర్ అన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications