పన్నీరు సెల్వంకు ఝలక్: శశికళకు శ్రీలంక 'అధికారిక' లేఖ
శ్రీలంక పరిధిలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో జరగనున్న వేడుకలకు వంద మంది తమిళ జాలర్లను అనుమతించనున్నట్లు శ్రీలంక శశికళకు లేఖ రాసింది.
చెన్నై: శ్రీలంక ప్రభుత్వం అధికారిక లేఖను జయలలిత నెచ్చెలి శశికళకు రాయడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక పరిధిలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో జరగనున్న వేడుకలకు వంద మంది తమిళ జాలర్లను అనుమతించనున్నట్లు శ్రీలంక లేఖ రాసింది.
జయలలిత మృతి: స్టాలిన్ సంచలనం, చికిత్సపై అనుమానాలు
ఈ లేఖను తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు కాకుండా అన్నాడీఎంకే పగ్గాలు చేపడుతుందని భావిస్తున్న శశికళకు శ్రీలంక ప్రభుత్వం రాయడం గమనార్హం.
అధికారిక సమాచారాన్ని బీజేపీ ఎంపీ పోన్ రాధాకృష్ణతో పాటు శశికళకు పంపించారు. పన్నీరు సెల్వంకు కాకుండా శశికళకు అధికారిక లేఖ పంపించడం ద్వారా శ్రీలంక.. ఆమెను ముఖ్యమంత్రి కంటే ఉన్నత స్థానంలో చూస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఎవరికీ భయపడొద్దు!: శశికళను ఎందుకు కలుస్తున్నారు?
శ్రీలంక అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన, ఎంపీ అరుముగన్ తొండమాన్లు శశికళకు 100 మంది జాలర్లను వేడుకలకు అనుమతించనున్నట్లు లేఖ రాశారు. పన్నీరు సెల్వంకు రాయకుండా శశికళకు రాయడమేమటనే చర్చ సాగుతోంది. ఓ తమిళ చానల్ ఈ లేఖలను ట్విట్టర్లో ఉంచింది.