శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
శ్రీలంకలో వాయువ్య, తూర్పు ప్రావిన్సులు కలిసే చోట తెలుగు, తమిళం భాషల్లో రాసిన ఓ రాగి శాసనం లభ్యమైందని జాఫ్నా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ పి. పుష్పరత్నం వెల్లడించారు.
తమిళ సంప్రదాయ మూలాలు శ్రీలంకలో ఉన్నాయనడానికి ఈ ప్రత్యేకమైన శాసనం ఆధారం అని ఆయన చెప్పారు.
రాగి శాసనం లభ్యమైన ప్రాంతం, పొలోన్నరువా, బట్టికలోవా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. ఇది చరిత్ర ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం.
బ్రిటిష్ కాలం నుండే పాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంతం పొలోన్నరువా జిల్లాలో అంతర్భాగంగా ఉంది. మన్నంపిటియాలోని హిందూ, బౌద్ధ దేవాలయాలు, దేవాలయాల అవశేషాలు, ఈ ప్రాంత చారిత్రక వారసత్వానికి నిదర్శనం.
తంబంకాడులోని చిత్రవేలాయుధర్ ఆలయంలో ఈ రాగి శాసనాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతకు ఇది మరొక సాక్ష్యం.
ఈ ఆలయ ప్రారంభ కాలంపై సరైన ఆధారాలు లేవు. ఇది మతాలతో సంబంధంలేని దేవాలయంగా ప్రజల చెబుతున్నారు. ప్రొఫెసర్ పి. పుష్పరత్నం ప్రకారం, 'వేల్' చిహ్నాన్ని కలిగి ఉన్న ఆలయం, కాలక్రమేణా సాంస్కృతిక ప్రాధాన్యతతో రాళ్లను ఉపయోగించి నిర్మించారు.
ఆలయ పునరుద్ధరణ సమయంలో దొరికిన పాత ఆలయ భవన అవశేషాలు, పూజా సామాగ్రిలను, ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక స్థలంలో సురక్షిత ప్రాంతంలో ఉంచారు.
భద్రపరచిన స్తంభాల్లోని ఒకదానిలో ఈ కాంస్య శాసనం లభ్యమైంది. రాగి పూతతో అలంకరించిన ఆ స్తంభం ఆలయంలోని ప్రధాన మందిర గదిలోని భాగం.
ఈ 5 అడుగుల పొడవున్న స్తంభంపై రాగి పూత అమర్చి ఉంది. స్తంభం ప్రారంభంలో, చివరలో అర్ధ వృత్తాకార తామర పుష్పాలు చెక్కి ఉన్నాయి. మధ్యలో ఉన్న కమలానికి ఎడమ వైపు తెలుగులో, కుడి వైపు తమిళంలో రాసి ఉంది.
- హరియాణా స్కూళ్లలో తెలుగు భాషా బోధన... అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అంటూ మాట్లాడుతున్న విద్యార్థులు
- తెలుగు భాష: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
తమిళంలో చెక్కిన పద్యాలను ప్రొఫెసర్ పి. పుష్పరత్నం ధృవీకరించగా, తెలుగులో ఉన్న శాసనాలను భాషా నిపుణులు నిర్ధారించారు. తమిళంలో ఉన్న అంశాలు, తెలుగులో కూడా ప్రస్తావించారని ప్రొఫెసర్ పి. పుష్పరత్నం అన్నారు.
తంబంకాడులోని చిత్రవేలాయుధర్ దేవాలయ ప్రధాన మందిరానికి కాంస్య మెట్లు నిర్మించడానికి ప్రజల నుండి విరాళాలు ఎలా సేకరించారనే అంశాల గురించి రాగి శాసనం తెలుపుతుంది.
శాసనంలోని వివరాలను చదివినప్పుడు, అది 18 లేదా 19వ శతాబ్దాలకు చెందినదని అర్థం చేసుకోవచ్చని ప్రొఫెసర్ పుష్పరత్నం పేర్కొన్నారు.
బట్టికలోవా జిల్లాలో కనిపించే చాలా స్మారక చిహ్నాలలో తమిళ భాష ఉంది. చిత్రవేలాయుధర్ దేవాలయంలో చిత్రించిన రాగి పూత తమిళం, తెలుగు భాషల చారిత్రాత్మక ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
15వ శతాబ్దంలో తూర్పు ప్రావిన్స్లోని బట్టికలోవా ప్రాంతాన్ని కాండీ రాజు పరిపాలించారు. పాలకులు తమిళులు అయితే, వారి అధికారుల మాతృభాష తెలుగు. ఈ పాలకులు భారతదేశంలోని మధురై నాయక వంశానికి చెందినవారు.
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- ట్రాన్స్లేటర్ల ఉద్యోగాలకు కంప్యూటర్లు ఎసరు పెట్టగలవా?
ఈ సమాచారాన్ని ఒక ప్రాతిపదికగా పరిగణించి, కాంస్య మెట్లు తెలుగు అధికారుల సహాయంతో రూపొందించినట్టు భావించవచ్చని ప్రొఫెసర్ పేర్కొన్నారు.
శ్రీలంకలో నివసిస్తూ తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తుల చరిత్ర ఇది. శ్రీలంకలో కాండీ పాలనకు ముందు, తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తులు అక్కడ నివసించినట్లు ఆధారాలు లభించాయని ప్రొఫెసర్ పుష్పరత్నం పేర్కొన్నారు.
జాఫ్నా రాజ్య కాలంలో తమిళం మాట్లాడే సైనికులే కాకుండా ఇతర భాషల సైనికులు కూడా రాజ్యానికి సేవ చేసినట్లు స్పష్టమవుతోంది. వారే తెలుగు, కన్నడ సైనికులుగా భావిస్తున్నారు.
రాజ్యం పతనం తర్వాత ఈ సైనికులలో కొంత మంది తమిళం మాట్లాడే ప్రజలతో దేశంలోనే ఉండిపోయారు.
ఇవి కూడా చదవండి:
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- '13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- 'ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను నిర్మూలించవచ్చా?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)