బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Second wife: మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు, రెండో భార్య మోజులో భర్త ఏం చేశాడంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మూడు నెలల క్రితం భార్య చనిపోవడంతో భర్త దగ్గరే అతని పిల్లలు ఉన్నారు. కామంతో రగిలిపోతున్న భర్త అతని భార్య చనిపోయి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్య మోజులో బిడ్డలను పట్టించుకోవడం మరిచిపోయిన తండ్రి అతని రెండో భార్యతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. తన విలాసాలకు, సంతోషానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని కన్న తండ్రితో పాటు సవతి తల్లి కలిసి చిన్నారులకు చిత్రహింసలు పెట్టారు. దెబ్బలు తట్టుకోలేక ముగ్గురు పిల్లలు రోడ్డు మీదకు పరుగు తియ్యడం కలకలం రేపింది.

Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !

ముగ్గురు పిల్లల తల్లి

ముగ్గురు పిల్లల తల్లి


ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని జేపీ నగర్ లో సెల్వ, అంజలి దంపతులు నివాసం ఉంటున్నారు. సెల్వ, అంజలి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మూడు నెలల క్రితం అంజలి మరణించింది. అప్పటి నుంచి సెల్వ దగ్గరే అతని ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. తల్లి లేకపోవడంతో తండ్రి ఇంటికి వచ్చినప్పుడే ఆ పిల్లలు కొంచెం సంతోషంగా ఉంటున్నారు.

 కామంతో రగిలిపోయిన తండ్రి

కామంతో రగిలిపోయిన తండ్రి

భార్య అంజలి మరణించి మూడు నెలలు పూర్తి కాకుండానే సెల్వ సత్యా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య సత్యాతో కలిసి సెల్వా ఇంట్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. తండ్రి వేరే ఆమెతో ఇంట్లో ఎంజాయ్ చేస్తుండటంతో అన్నం పెట్టే దిక్కేకరువు కావడంతో ఆ ముగ్గురు పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇంట్లో అడ్డుగా ఉన్నారని రెండో భార్య డ్రామాలు

ఇంట్లో అడ్డుగా ఉన్నారని రెండో భార్య డ్రామాలు

కొత్తగా పెళ్లి చేసుకుని భర్త సెల్వతో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటున్న తనకు తన సవతి బిడ్డలు అడ్డుగా ఉన్నారని సత్యా రగిలిపోయింది. ఇంటికి వచ్చిన భర్త సెల్వకు నీ ముగ్గురు బిడ్డలు ఎక్కువ అల్లరి చేస్తున్నారని, చెప్పిన మాట వినడం లేదని లేనిపోయి అపద్దాలు చెప్పి అతనితో కొట్టిస్తున్నది.

రెండో భార్యకు దాసోహం అయ్యాడు

రెండో భార్యకు దాసోహం అయ్యాడు

రెండో భార్య సత్యాకు పూర్తిగా దాసోహం అయిన సెల్వ ఆమె చెప్పినమాటలు నమ్మి ముగ్గురు బిడ్డలను చితకబాదడం మొదలుపెట్టారు. ప్రతిరోజు రాత్రి ఇంటికి వస్తున్న తండ్రి కొట్టే దెబ్బలు తట్టుకోలేక, బయటకు వెళ్లి ఉండలేక ముగ్గురు పిల్లలు నరకం అనుభవించారు. తన భర్త సెల్వ తన మాట పూర్తిగా వింటున్నాడని తెలుసుకున్న సత్యా ఇంకా రెచ్చిపోయింది.

 దోసెల కాడతో వాతలు పెట్టిన పిన్ని

దోసెల కాడతో వాతలు పెట్టిన పిన్ని

బుధవారం ఉదయం ఇంట్లో దోసలు చేస్తున్న సత్యా పిల్లల మీద కోపంతో దోసెల కాడ కాల్చి ముగ్గురికి వాతలు పెట్టింది. ఇంట్లోనే ఉన్న కన్న తండ్రి సైతం రెండో భార్యకు అడ్డుచెప్పకుండా చోద్యం చూశాడు. వాతలు పడటంతో మంటలు తట్టుకోలేని పిల్లలు రోడ్డు మీదకు పరుగు తీసి బోరన విలపించారు. ప్రతిరోజు సవతి తల్లి పిల్లలకు చిత్రహింసలు పెడుతున్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 బెండ్ ఎత్తేసిన పోలీసులు

బెండ్ ఎత్తేసిన పోలీసులు

పోలీసులు వెళ్లి ముగ్గురు పిల్లల మీద పడిన వాతలు చూసి చలించిపోయారు. పిల్లల తండ్రి సెల్వాతో పాటు అతని రెండో భార్య సత్యాను అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరికి బెండ్ ఎత్తేశారు. ముగ్గురు పిల్లలను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Step mother: JP Nagar police arrested accused for assault on kids in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X