AP SSC Advanced Supplementary Results: పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల..!
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు, బెటర్మెంట్ కోరుకున్న వారి కోసం నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (AP SSC Advanced Supplementary Results) ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఎలా తెలుసుకోవచ్చో కూడా వివరాలు ఇచ్చారు.
మే 2026లో నిర్వహించిన ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల (ASE) ఫలితాలను ప్రకటించడం సంతోషంగా ఉందని లోకేష్ ఇవాళ ట్వీట్ చేసారు. ఈ పరీక్షలకు హాజరైన 94,990 మంది విద్యార్థులలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దీనివల్ల ఉత్తీర్ణత శాతం 82.39%గా నమోదైందని వెల్లడించారు. ఇది గత ఏడాది ఉన్న 76.14%తో పోలిస్తే 6.25 శాతం పాయింట్ల పెరుగుదలతో కూడిన గణనీయమైన పురోగతి అన్నారు.

SSC పబ్లిక్ పరీక్షల తర్వాత విద్యార్థులకు ప్రత్యేక విద్యాపరమైన మద్దతు, విస్తృతమైన శిక్షణ, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందించిన ప్రభుత్వం యొక్క '20-రోజుల కార్యాచరణ ప్రణాళిక' (20-Day Action Plan) విజయవంతమైందని ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని లోకేష్ తెలిపారు. ఈ విజయం సాధ్యం కావడానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకుల కృషి, అంకితభావానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ తమ విద్యా ప్రయాణంలోనూ, భవిష్యత్తు ప్రయత్నాలలోనూ నిరంతర విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చని లోకేష్ తెలిపారు.
📱 Mana Mitra WhatsApp Governance (95523 00009)
📱 LEAP Mobile App
💻 https://results.bse.ap.gov.in
📄 DigiLocker












Click it and Unblock the Notifications