కాక్రోచ్ జనతా పార్టీ- డైరెక్ట్ ప్రధాని మోదీతోనే ఢీ: కీలక ప్రతిపాదన

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ తేదీ దగ్గరపడుతోంది. ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ నెల 21వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరుగనుంది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మునుపెన్నడూ లేనంత అత్యంత కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది. ఈ ప్రవేశ పరీక్షను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఈ పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే తెరమీదికి వచ్చారు. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస పరీక్షల వివాదాలు, విద్యా రంగంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సుదీర్ఘ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

CJP Founder Abhijeet Dipke Urges PM Modi Pay Rs 1 Cr Compensation to Suicide-Affected Student Families

పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి మానసిక ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిజీత్ డిప్కే ఈ లేఖ ద్వారా కోరారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పరీక్షలలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పరీక్షల నిర్వహణ తీరును నిరసిస్తూ, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరుతూ యువత నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి పెద్ద ఎత్తున దేశ రాజధాని వేదికగా ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తోంది. జూన్ 20వ తేదీన ఢిల్లీజంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్, నెట్ పరీక్షల పరిణామాలు లక్షలాది మంది అర్హులైన అభ్యర్థులలో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. సంవత్సరాల తరబడి శ్రమించినా పరీక్షల పారదర్శకత లోపించడం వల్ల యువత నైరాశ్యంలోకి జారుకుంటోంది. పరీక్షలలో లీకేజీలు, నకిలీ పత్రాల వ్యవహారం వల్ల విద్యార్థుల ఆశయాలు నీటిపాలవుతున్నాయని, ఈ పరిస్థితులు దేశంలో ఎన్నడూ చూడని విద్యా సంక్షోభానికి దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+