వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రైళ్లు ప్రారంభానికి నోచుకున్న ప్రతీసారీ ఈ దాడులు తప్పట్లేదు. గతంలో సికింద్రాబాద్- విశాఖపట్నం, అహ్మదాబాద్-ముంబై, తిరువనంతపురం-కాసర్‌గాడ్, చెన్నై- మైసూరు.. ఇలా దాదాపు అన్ని మార్గాల్లో ప్రయాణించే వందే భారత్ రైళ్లపై దాడులు జరిగాయి.

ఇప్పుడు తాజాగా బెంగళూరు- ధార్వాడ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైనా రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. బెంగళూరు నుంచి ధార్వాడ్ బయలుదేరిన నంబర్ 20661 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఈ రాళ్ల దాడి జరిగింది. మార్గమధ్యలో కడూర్ స్టేషన్ దాటిన కొద్దిసేపటికి ఈ ఘటన సంభవించింది.

Vande Bharat express train

కరూర్ దాటి.. బిరూర్ వైపు వెళ్తోన్న సమయంలో ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కిటికీ అద్దాలు పగిలినట్లు నైరుతి రైల్వే అధికారులు వెల్లడించారు. కిందటి నెల 27వ తేదీన ప్రారంభమైన ఈ రైలుపై రాళ్లు రువ్విన ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ రైలుకు మంచి డిమాండ్ ఉంటోంది. 90 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటోంది.

ప్రతిరోజూ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి ధార్వాడకు బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 12:40 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 1:15 నిమిషాలకు మళ్లీ ధార్వాడ నుంచి బయలుదేరి రాత్రి 8:10 నిమిషాలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఎనిమిది కోచ్‌లు ఉండే మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు గదగ్, హుబ్బళ్లి మీదుగా ధార్వాడకు చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం సుమారుగా 12 గంటలు. వందే భారత్ వల్ల ఏడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కర్ణాటకలో రాకపోకలు సాగించే రెండో వందే భారత్ ఇదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+