Students: ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్, గోవింద్ కు గూబ !
అహమ్మదాబాద్/గుజరాత్: ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేసిన వ్యక్తి తరువాత ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్ అయ్యాడు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ లో ఉంటున్న హెడ్ మాస్టర్ సాయంత్రం ఇంట్లో ట్యూషన్ చెబుతున్నాడు. హెడ్ మాస్టర్ దగ్గర ట్యూషన్ కు వెలుతున్న 10వ తరగతి విద్యార్థులు దాదాపుగా అందరూ పాస్ అవుతుండటంతో ఆ ప్రాంతంలో అతనికి మంచి పేరు ఉంది. అదే మంచి పేరు అడ్డం పెట్టుకున్న హెడ్ మాస్టర్ అందమైన అమ్మాయిల మీద కన్ను వేశాడు. ట్యూషన్ చెప్పే ముసుగులో అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు.

హెడ్ మాస్టర్
ట్యూషన్కు వచ్చిన 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సార్ మ్యాటర్ మొత్తం బయటకు లాగుతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లోని చంద్కేటా ఏరియాలో గోవింద్ పటేల్ అలియాస్ పటేల్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్న పటేల్ ఆయన ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాడు.

ఫేమస్ అయిపోయాడు
హెడ్ మాస్టర్ పటేల్ దగ్గర ట్యూషన్ కు వెలుతున్న 10వ తరగతి విద్యార్థులు దాదాపుగా అందరూ పాస్ అవుతుండటంతో ఆ ప్రాంతంలో అతనికి మంచి పేరు ఉంది. అదే మంచి పేరు అడ్డం పెట్టుకున్న హెడ్ మాస్టర్ పటేల్ 10వ తరగతి చదువుతున్న అందమైన అమ్మాయిల మీద కన్ను వేశాడు. ఇంట్లో భార్య లేని సమయంలో గోవింద్ పటేల్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెబితే హెడ్ మాస్టర్ పటేల్ మాకు ట్యూషన్ చెప్పడని, తరువాత 10వ తరగతి ఫెయిల్ అయిపోతామని అమ్మాయిలు భయపడుతూ వచ్చారు.

ధైర్యం చేసిన అమ్మాయి
10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినిపై హెడ్ మాస్టర్ పటేల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పటేల్ మీద కేసు నమోదు అయ్యింది. తాను ట్యూషన్ కోసం ఇంటికి వెళ్లినప్పుడల్లా హెడ్ మాస్టర్ గోవింద్ పటేల్ తనతో అసభ్యకర హావభావాలుతో సైగలు చెయ్యడం, అనుచిత శబ్దాలు చేస్తున్నాడని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.

గోవింద్ పటేల్ కు గుబ గుయ్ మనింది
రోజూ ఇలాంటి పనులు చేయడమే కాకుండా తన సెల్ ఫోన్ కు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని విద్యార్థిని వాపోయింది. దీంతో తట్టుకోలేని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉపాధ్యాయుడు గోవింద్ పటేల్పై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అహమ్మదాబాద్ పోలీసులు తెలిపారు. హెడ్ మాస్టర్ గోవింద్ పటేల్ అలియాస్ పటేల్ ఇంకా ఇలాగే విద్యార్థులతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడా ? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications