డీఆర్డీవో 2డీజీ : అన్ని కోవిడ్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్న డ్రగ్.. పరిశోధనలో వెల్లడి
డీఆర్డీవో తయారుచేసిన యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డీజీ అన్ని రకాల కోవిడ్ 19 వేరియంట్స్పై సమర్థవంతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కణాల్లో వైరస్ విస్తృతిని తగ్గించడమే కాకుండా దాని తీవ్రతను తగ్గించడం ద్వారా కణాలు మృతి చెందకుండా చేయగలదని వెల్లడైంది. వైద్య నిపుణులు అనంత నారాయణ భట్, అభిషేక్ కుమార్, యోగేష్ రాయ్, దివియ యాదగిరిలతో కూడిన బృందం పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జూన్ 15న వెలువడిన ఈ పరిశోధనపై మరింత సూక్ష్మ స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉంది. ప్రస్తుతం వెలువడిన ఫలితాలు ప్రాథమిక పరిశోధనకు సంబంధించినవేనని చెబుతున్నారు.

2డీజీ డ్రగ్తో త్వరగా కోలుకుంటారు...
క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైన వివరాల ప్రకారం... కోవిడ్తో ఆస్పత్రిపాలైన పేషెంట్లకు 2డీజీ డ్రగ్ ఇవ్వడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారు. సాధారణంగా కోవిడ్ పేషెంట్ వ్యాధి నుంచి కోలుకోవడానికి పట్టే సమయం కంటే... ఈ డ్రగ్ తీసుకోవడం ద్వారా రెండున్నర రోజుల ముందే కోలుకుంటారు. అలాగే పేషెంట్కు బయటినుంచి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం 40 శాతం తగ్గుతుంది.ఈ డ్రగ్ వైరస్ వ్యాపించిన కణాలకు గ్లూకోజ్ అందకుండా చేయడం ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రోగుల్లో తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు.

మంచినీళ్లలో కలుపుకుని తాగడమే...
డీర్డీవో 2డీజీ డ్రగ్ను కోవిడ్ అత్యవసర చికిత్సలో వినియోగించేందుకు కేంద్రం మే 19న అనుమతినిచ్చింది. డీఆర్డీవో,డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా దీన్ని అభివృద్ది చేశాయి. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ డ్రగ్ను అధికారికంగా విడుదల చేశారు. సాచెట్ రూపంలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సాచెట్ ధర రూ.990గా నిర్ణయించారు. దీన్ని మంచినీళ్లలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే దీన్ని వినియోగించాలని డీసీజీఐ(Drugs Controller General of India) సూచించింది. కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయిన తర్వాత గరిష్టంగా 10 రోజులపాటు 2డీజీ డ్రగ్ ఇవ్వొచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని సూచించింది.

వారికి ఈ డ్రగ్ ఇవ్వొద్దు...
2-డీజీ ఔషధం ఒక రకంగా గ్లూకోజ్ వంటిది. ఇలాంటి జనరిక్ మాలిక్యూల్ను తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా వేగంగా వ్యాధిని నయం చేసే అవకాశం ఉంటుంది. పొడి రూపంలో ఉండే ఈ మందు సాచెట్లలో అందుబాటులోకి వచ్చింది. దీన్ని నీటిలో కలుపుకుని తాగిన వెంటనే మందు పనిచేయడం మొదలవుతుంది. 2డీజీ డ్రగ్ వాడిన రోగులు త్వరగా కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వొద్దని కేంద్రం గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications