మోడీ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక: గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుక ఇచ్చింది. వంట గ్యాస్ ధరపై వినియోగదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాయితీలని వంట గ్యాస్ సిలిండర్ పైన రూ.120.50 పైసలు తగ్గించింది. రాయితీగల సిలిండర్ పైన రూ.5.91 పైసలు తగ్గించింది. ఈ ధరలు మంగళవారం అంటే జనవరి 1వ తేదీ 2019 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం నిర్ణయం సామాన్యులకు ఎంతో ఊరట.
కేంద్రం ఇచ్చిన ఊరటతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.500.90గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.494.99 పైసలుగా ఉండనుంది. ఎల్పీజీ గ్యాస్ ధర తగ్గడం ఇది వరుసగా రెండోసారి. డిసెంబర్ 1వ తేదీన ఎల్బీజీ గ్యాస్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మరోసారి తగ్గింది.













Click it and Unblock the Notifications