రజనీకాంత్ కన్నడ బాష అభిమానం: అదే రాజకీయం, బెంగళూరు టార్గెట్, ఎంట్రీ !
బెంగళూరు/చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని కచ్చితంగా చెప్పారు. అయితే తన రాజకీయ పార్టీ తమిళనాడుకు మాత్రమే పరిమితం అని ఇప్పటి వరకూ రజనీకాంత్ ఎక్కడా చెప్పలేదు. రజనీకాంత్ త్వరలో కర్ణాటకలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి అదృష్టాన్ని పరీక్షించుకుంటారని సమాచారం.

కొత్త రాజకీయ పార్టీ
తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెడుతానని ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించారు. తమిళనాడులోని 234 శాసన సభ నియోజక వర్గాల్లో మా పార్టీ పోటీ చేస్తోందని రజనీకాంత్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా ? వద్దా ? అనే విషయం రజనీకాంత్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

ప్రాంతీయ పార్టీ కాదు ?
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తాను కొత్తగా స్థాపించే పార్టీ కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం అని రజనీకాంత్ ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు.

మరాఠి, కన్నడ దెబ్బ
గతంలో కావేరీ, హోగేనికల్ నీటి పంపిణి వివాదంపై తమిళనాడులో జరిగిన పోరాటాల సందర్బంలో రజనీకాంత్ కొన్ని సార్లు మౌనంగా ఉన్నారు. ఆ సందర్బంలో కర్ణాటకలో జన్మించిన రజనీకాంత్ కన్నడిగులకు మద్దతుగా ఉంటున్నారని, తమిళ ప్రజల కోసం ఏ మాత్రం పోరాటం చెయ్యడానికి ముందుకు రాలేదని అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విమర్శించారు.

రజనీకాంత్ క్లారిటీ
తాను కన్నడిగుడు అని విమర్శించిన వారికి రజనీకాంత్ సరైన సమాధానం ఇచ్చారు. తాను కర్ణాటకలో జన్మించినా, మరాఠి అయినా తమిళ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, తాను తమిళ ప్రజల పక్షపాతి అని రజనీకాంత్ ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పారు.

కన్నడ అభిమాని
తన విద్యాభ్యాసం పూర్తిగా కన్నడ బాషలోనే జరిగిందని, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇటీవల రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. తన బాషాభిమానాన్ని ఎవ్వరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.

తమిళ ప్రజలు
తాను బెంగళూరులో పుట్టి పెరిగినా తమిళ ప్రజలు తనకు అండగా నిలిచారని, తమిళనాడు ఆదరించడం వలనే తాను ఈ స్థాయిలో ఉన్నానని రజనీకాంత్ ఇటీవల అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి తమిళ ప్రజలకు సేవ చేస్తానని రజనీకాంత్ స్పష్టం చేశారు.

కర్ణాటకలో పోటీ !
2018 కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో రజనీకాంత్ కొత్తపార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. రజనీకాంత్ కర్ణాటకలోనే తన రాజకీయ జీవితం ప్రారంభించడానికి ఆస్కారం ఉందని సమాచారం.

బెంగళూరులో పోటీ !
బెంగళూరు నగరంలోని గాంధీనగర్, శాంతినగర్, సీవీ రామన్ నగర్, సర్వజ్ఞనగర్, బోమ్మనహళ్ళి శాసన సభ నియోజక వర్గాల్లో, కోలారు జిల్లాలోని కేజీఎఫ్ నియోజక వర్గంలో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా తమిళ ప్రజల ఓట్లు కీలకం కానున్నాయి.

కన్నడ, తమిళ సెంటిమెంట్ !
కన్నడ బాష మీద ఉన్న అభిమానాన్ని రజనీకాంత్ పదేపదే ప్రస్తావించారు. తమిళ, కన్నడ సెంటిమెంట్ తో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో రజనీకాంత్ కొత్త పార్టీ సుమారు 14 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications