కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినం రోజున టపాకాయలు కాల్చే అంశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దక్షిణాది రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఇచ్చింది. ఉదయం, లేదా సాయంత్రం ఎప్పుడైనా టపాకాయలు కాల్చుకునేందుకు న్యాయస్థానం ఒకే చెప్పింది. అయితే రెండు గంటలకు మించకూడదని తెలిపింది.
ఇటీవల కేవలం రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్య, కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఉదయం లేదా సాయంత్రం రెండు గంటలు టపాకాయలు కాల్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

కాగా, బాణసంచా కాల్చడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు టపాసులు కాల్చడంపై ఇటీవల తీర్పు చెప్పింది. బాణసంచాను పూర్తిగా నిషేధించలేమని స్పష్టం చేసింది.
టపాసుల అమ్మకాలపై నియంత్రణ అవసరమని చెప్పింది. కాలుష్య రహిత టపాసులు అమ్మేలా చూడాలన్నారు. లైసెన్స్ ఉన్నవారే టపాసులు అమ్మాలని షరతు విధించింది. అదే సమయంలో బాణసంచా కాల్చే సమయంపై నిబంధనలు విధించింది. రాత్రి ఎనిమిది గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని చెప్పింది. ఇప్పుడు ఉదయం కూడా కాల్చుకోవచ్చునని చెప్పింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications