Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీం అసాధారణ నిర్ణయం- ఆ బుక్ బ్యాన్-కేంద్రం క్షమాపణలు..!

దేశ చరిత్రలో సుప్రీంకోర్టు (supreme court) మరో అసాధారణ నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్య పరిశోధక మండలి (NCERT) ముద్రించిన 8వ తరగతి పుస్తకాన్ని నిషేధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పుస్తకంలో ఉన్న వివాదాస్పద ఛాప్టర్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

న్యాయవ్యవస్ధలో అవినీతి పేరుతో ఛాప్టర్ ముద్రించిన NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని సుప్రీంకోర్టు ఇవాళ నిషేధించింది. అలాగే ఎన్సీఈఆర్టీ అధిపతిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వివాదాస్పద అధ్యాయం ముద్రణపై కేంద్రం క్షమాపణలు చెప్పింది. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోషల్ సైన్సెస్ పాఠ్యపుస్తకం, ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్, వాల్యూమ్ 2 తదుపరి ప్రచురణ, పునర్ముద్రణ లేదా డిజిటల్ సర్క్యులేషన్‌పై పూర్తి నిషేధం విధించింది.

Supreme court Bans NCERT Book Over Controversial Judiciary Chapter Centre Apologizes

ఎలక్ట్రానిక్ పంపిణీ లేదా మార్చబడిన శీర్షికల ద్వారా సహా తమ ఆదేశాలను ఉల్లంఘించేందుకుచేసే ఏ ప్రయత్నమైనా, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయవ్యవస్థ అధిపతిగా, జవాబుదారీతనం నిర్ధారించడం తన విధి అని, జవాబుదారీతనం వచ్చే వరకు తాను విచారణ ప్రక్రియను కొనసాగిస్తానని సీజేఐ తెలిపారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. మీరు మొత్తం బోధనా సమాజానికి, విద్యార్థులకు న్యాయవ్యవస్థ అవినీతిపరుడని బోధిస్తే - ఏ సందేశం వెళుతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు దానిని నేర్చుకుంటారు, తల్లిదండ్రులు దానిని నేర్చుకుంటారని తెలిపారు. దీంతో కేంద్రం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది.

మరోవైపు ప్రచురణ వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ, అది విస్తృతంగా సర్కులేట్ అవుతూనే ఉందని ప్రధాన న్యాయమూర్తి గుర్తించారు. ప్రచురణ ఉపసంహరించినట్లు మీరు అంటున్నారని, అది మార్కెట్లో, సోషల్ మీడియాలో ఉందని గుర్తుచేశారు. నా దగ్గర పుస్తకం కాపీ కూడా ఉందన్నారు. ఈ రోజు మీరు పేల్చిన తూటాకు న్యాయవ్యవస్థ రక్తసిక్తం అవుతూందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ అధ్యాయం ఉన్న పుస్తకం అన్ని కాపీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీజే ఆదేశించారు. ఈ అధ్యాయంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు భవిష్యత్తులో ఈ మంత్రిత్వ శాఖ యొక్క ఏ కార్యకలాపాలలోనూ పాల్గొనరని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+