Whatsapp: వాట్సాప్ కు సుప్రీం తీవ్ర హెచ్చరిక..! ఆటలు సాగనివ్వం..!
సోషల్ మీడియా ఛాటింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ (whatsapp)పై ఇవాళ సుప్రీంకోర్టు (supreme court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనల విషయంలో వాట్సాప్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది. ఈ దేశ ప్రజల గోప్యతతో ఆటలు ఆడుకునేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు వాట్సాప్ తమ మాతృసంస్థ అయిన మెటాతో యూజర్ల డేటాను షేర్ చేసునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.
వాట్సాప్ పై సుప్రీం ఫైర్
వాట్సాప్ మాతృ సంస్థ అయిన టెక్ దిగ్గజం మెటా ప్లాట్ఫామ్ గోప్యతా విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ .. అమెరికా సంస్థకు ఈ మేరకు హెచ్చరికలు చేశారు. "మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతించము" అని తేల్చిచెప్పారు. ఆ కంపెనీ దేశ చట్టాలను పాటించడంలో విఫలమైతే భారతదేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు.

మీ విధానాలు అందరికీ అర్ధంకావు
మన దేశంలో డేటా షేరింగ్, మార్కెట్ ఆధిపత్యానికి సంబంధించి గత నెలలో ఎన్టీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీం విచారణ జరిపింది. ఇందులో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ వినియోగదారుల డేటా షేరింగ్ పై అభ్యంతరం తెలిపింది. దీంతో సీజేఐ సూర్యకాంత్.. టెక్ దిగ్గజాల వాదనలను తప్పుబట్టారు. వీధి వ్యాపారులు, గ్రామీణ పౌరులు సహా లక్షలాది మంది వినియోగదారులు సంక్లిష్టమైన గోప్యతా విధానాలను అర్థం చేసుకోలేరని గుర్తుచేశారు.

ఆ హామీ ఇవ్వకపోతే కేసు కొట్టేస్తాం
డేటా షేరింగ్ ఉండదని హామీ ఇవ్వాలని, లేదంటే మేమే మీ కేసును కొట్టేస్తామని హెచ్చరించారు. వాట్సాప్ తరపు న్యాయవాది తమ గోప్యతా విధానం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉందని వాదించగా, డేటా షేరింగ్ మాతృ సంస్థకే పరిమితం అని మెటా తెలిపింది. అయితే చాట్ ట్రెండ్ల ఆధారంగా ప్రకటనలతో సహా వినియోగదారు డేటా ప్రవర్తన, వాణిజ్య దోపిడీ వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తుందని కోర్టు తెలిపింది. వైద్యులతో ప్రైవేట్ చాట్ల తర్వాత వినియోగదారులు ఔషధాల కోసం ప్రకటనలను అందుకున్న సందర్భాలను కూడా గుర్తుచేసింది. ఇది డేటా మానిటైజేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications