ఢిల్లీపై పెత్తనం ఎవరిది ? సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఢిల్లీలో కొన్నేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికీ, కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు మధ్య వార్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంలో విఫలమవుతున్న బీజేపీ.. కేంద్రంలో తమకున్న అధికారంలో లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి వారితో ఢిల్లీపై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వానికీ, లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుపై గతంలో విచారణ జరిపిన కోర్టులు.. ప్రభుత్వం కంటే గవర్నర్ కే అధికారం ఉందని తేల్చిచెప్పాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పుల్ని కొట్టేసింది.
ఢిల్లీలో కార్యనిర్వాహక అధికారం విషయంలో ప్రభుత్వానికీ, లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ పాలనకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆప్ ప్రభుత్వం వాదించింది. దీనిపై విచారణ జరిపిన ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తేల్చిచెప్పింది.

ఢిల్లీలో పాలన కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఇతర రాష్ట్రాల తరహాలోనే ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీలో సర్వీసుల విషయంలో తమకే అధికారం ఉండాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వాదనతో ఏకీభవించింది. దీంతో ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకంతో ఆప్ ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications