రాజకీయ ప్రత్యర్దులపై ఈడీని వాడతారా ? సుప్రీం చీవాట్లు..! తెలుగు రాష్ట్రాల్లో కేసుల వేళ..!
దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీని విచ్చలవిడిగా ప్రయోగిస్తుందన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ ఈడీ నమోదు చేసిన కేసుల వెనుక ఉన్న రాజకీయంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలకు ఈడీని వాడుకోవడంపై దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలపై సుప్రీం మండిపడింది.
లాయర్లు ఈడీ కేసుల్లో ఉన్న తమ క్లయింట్లకు సలహా ఇచ్చారనే కారణంతో వారికి సమన్లు జారీ చేయడంపై ఇవాళ సుప్రీం ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులను ప్రధాన న్యాయమూర్తి తప్పుబట్టారు. ఇది ఇలా కొనసాగకూడదని, కొన్ని మార్గదర్శకాలు అవసరమని తెలిపారు. ఈడీ అన్ని హద్దులూ దాటేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ఈడీ చురుగ్గా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దీంతో పాటు మరో రెండు కేసుల్లోనూ ఈడీ తీరుపై అభ్యంతరం తెలిపిన సీజేఐ.. అదనపు అడ్వకేట్ జనరల్ ఎస్వీ రాజు నోరు తెరవవద్దని సూచించారు. లేకుంటే తాము దీనిపై తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా కొందరు సీనియర్ లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై బార్ అసోసియేషన్లు చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీం ఈ చర్య తీసుకుంది.

సీజే వ్యాఖ్యలకు స్పందిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఒక సంస్థ గురించి కథను రూపొందించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దయచేసి ఇంటర్వ్యూలు, వార్తలను పట్టించుకోవద్దని కోరారు.
తమ క్లయింట్ కు న్యాయసలహా ఇచ్చినందుకు లాయర్ కు ఈడీ నోటీసు జారీ చేయలేదని మాత్రం అంగీకరించారు. మరో కేసులో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కుంభకోణానికి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను కూడా సీజే తిరస్కరించారు. ఏఏజీ ఎస్వీ రాజు నోరు విప్పితే ఈడీపై కఠిన వ్యాఖ్యలు చేస్తామని హెచ్చరించింది. రాజకీయ పోరాటాలకు ఈడీని వాడుకుంటారా అని ప్రశ్నించారు.
-
అవిశ్వాసానికి వేళాయే!: ఛైర్మన్కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీలు! -
లడ్డు వ్యవహారం హిందూ ధర్మంపై జరిగిన ఆర్గనైజ్డ్ క్రైమ్.. -
"మీరు క్రిస్టియన్.. కాదు నేను హిందువు": మండలిలో మతాల రచ్చ -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..!












Click it and Unblock the Notifications