పుల్వామా ఎఫెక్ట్ః రిసెప్షన్ రద్దు చేసుకుని అమరుల కుటుంబాలకు ఆ జంట ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?
సూరత్ : గురువారం జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఘటనపై ప్రపంచం అంతా భారత్కు మద్దతుగా నిలిచింది. అదే సమయంలో దేశంలోని చాలామంది అమరుల కుటుంబాలకు అండగా ఉంటామంటూ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సూరత్కు చెందిన ఓ కొత్త జంట తమ రిసెప్షన్ను రద్దు చేసుకున్నారు.
సూరత్లోని రెండు కుటుంబాలు తమ పిల్లల పెళ్లి ఘనంగా జరిపించాలని భావించారు. పెళ్లి ఘనంగా జరిపించారు. ఙక అంతే గ్రాండ్ గా రిసెప్షన్ కూడా చేయాలని భావించారు. అంతలోనే పుల్వామా దాడులకు సంబంధించిన చేదు వార్త వినాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. ఉగ్రవాదులు దాడులకు జవాన్లు అమరులయ్యారని తెలుసుకుని ఓ వైపు దేశమంతా బాధపడుతుంటే తాము మాత్రం ఇలా గ్రాండ్గా రిసెప్షన్ చేసుకోవడమేంటంటూ భావించి రిసెప్షన్ ను రద్దు చేసుకున్నాయి ఇరుకుటుంబాలు.

ఇక తమ రిసెప్షన్కు అయ్యే ఖర్చును రూ.5 లక్షలు సేవ కోసం మరో రూ.11 లక్షలు అమరులైన జవాను కుటుంబాల కోసం విరాళంగా ఇచ్చారు. హస్ముఖ్ భాయ్ సేథ్, అజయ్ సంఘ్వీ కుటుంబాలు ఈ డబ్బును విరాళంగా ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారు.. పెళ్లి సందర్భంగా వంట చేసే మనిషి కూడా తనవంతు సహాయం అందించాడు. ఇరు కుటుంబాలు వజ్రాల వ్యాపారం చేస్తున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications