నా కిడ్నీ పాడైపోయింది: ఎయిమ్స్లో సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 7వ తేదీ నుంచి ఎయిమ్స్లో ఆమె చికిత్స పొందుతున్నాన్నారు.
ఆమె మూత్ర పిండాల పనితీరు దెబ్బతిందని.. ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు మంగళవారం ప్రకటించారు. కాగా, ఈ విషయాన్ని నిర్ధరిస్తూ సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.
I am in AIIMS because of kidney failure. Presently, I am on dialysis. I am undergoing tests for a Kidney transplant. Lord Krishna will bless
— Sushma Swaraj (@SushmaSwaraj) November 16, 2016
తన కిడ్నీ పాడైందని.. ప్రస్తుతం వైద్యులు తనకు డయాలసిస్ చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు కిడ్నీ మార్చాల్సి ఉందని.. దీనికోసం వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేవుడు తనను ఆశీర్వదించాలని ప్రార్థించారు. కాగా, పలువురు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.