భారత సరిహద్దుల్లో ఆగని కవ్వింపు చర్యలు .. జమ్మూ వైమానిక స్థావరం సమీపంలో మళ్ళీ డ్రోన్ల సంచారం
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కవ్వింపు చర్యలు ఆగడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో భారత సరిహద్దుల్లో డ్రోన్లతో నిత్యం కలకలం సృష్టిస్తూనే ఉన్నారు. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్ వద్ద ఘోరమైన డ్రోన్ దాడి జరిగిన తరువాత వరుసగా డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరోమారు నేడు తెల్లవారుజామున మరో రెండు డ్రోన్ల కదలికను ఎయిర్ బేస్ సమీపంలో గుర్తించారు.
బుధవారం తెల్లవారుజామున 4.05 నిముషాల సమయంలో, వాయు స్థావరం నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న సత్వారీలోని జమ్మూ వైమానిక స్థావరం సమీపంలో ఒక డ్రోన్ కనిపించింది. మరికొంత దూరంలో ఇంకొక డ్రోన్ కనిపించినట్లుగా తెలుస్తోంది. సైనిక ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ప్రకారం రెండు డ్రోన్లు గుర్తించినట్లుగా, ఇక వాటిని చేదించే క్రమంలో అవి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. జూన్ 27 న జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలతో డ్రోన్ల ద్వారా దాడి చేశారు.

Recommended Video

ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. జూన్ 29న డ్రోన్లతో సహా, రోజురోజుకీ పెరుగుతున్న భద్రతా బెదిరింపులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపుల నుండి వచ్చే భద్రతా బెదిరింపులకు డ్రోన్లు కొత్త కోణాన్ని చేకూర్చాయని చెప్పారు. గత నెలలో జమ్మూ ఐఎఎఫ్ స్టేషన్పై జరిగిన దాడులపై దర్యాప్తులో, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి పాకిస్తాన్ సంస్థల సహకారం, ప్రమేయం ఉందని దిల్బాగ్ సింగ్ చెప్పారు.
గతంలో, సరిహద్దు దాటి డ్రోన్లు భారత భూభాగంలో కరెన్సీ, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని చేరవేయడానికి ఉపయోగించేవారని, ఉగ్రవాద కార్యకలాపాల్లో మానవరహిత వైమానిక వాహనాలను (యుఎవి) ప్రవేశపెట్టడంతో, వాటిని ఎదుర్కోవడం కోసం మరింత శిక్షణ భారత సైన్యానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇక భవిష్యత్తులో కూడా ఈ తరహా డ్రోన్లతో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 2019 నుండి పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇప్పటివరకు దాదాపు 300 డ్రోన్లను భారత భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్ సరిహద్దులలో డ్రోన్ల దాడితో, ఆ తర్వాత వరుసగా మిలటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుండి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు కూడా సత్వారీలోని జమ్మూ వైమానిక స్థావరం వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications