Tamil Nadu Polls: తమిళనాడులో 2021లో ఏం జరిగింది ? అప్పట్లో గెలుపు లెక్కలు ఇలా..!
తమిళనాడు (tamil nadu)లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో అధికార డీఎంకే కూటమితో పాటు విపక్షంలోని అన్నాడీఎంకే కూటమి, కొత్త పార్టీ టీవీకే అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఎవరికి వారే విజయంపై ధీమాగా ఉన్నారు. తాజాగా వెలువడిన సర్వేలు కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే గతంలో 2021లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ఒక సుదీర్ఘ రాజకీయ నాటకంలా సాగాయి. ఈ పోటీ కేవలం వ్యక్తిగత పార్టీల మధ్యే కాకుండా, కూటముల మధ్య జరిగిన పోరుగా నిలిచింది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ), అలాగే అన్నాడీఎంకే నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. రెండు కూటములూ 234 సీట్లకూ పోటీ చేశాయి. ఆ విధంగా కూటముల్లో సీట్ల పంపకాలు జరిగాయి.

ఇందులో డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమి 159 సీట్లు గెలుచుకుంది. ఈ కూటమిలో డీఎంకే పార్టీ స్వయంగా 173 సీట్లలో పోటీ 133 సీట్లలో గెలిచింది. డీఎంకే విజయశాతం కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే డీఎంకే కూటమిలో కీలక మిత్రపక్షం కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాలను గెలుచుకుంది. విదుతలై చిరుతైగళ్ కట్చి (VCK) 6 సీట్లలో పోటీ చేసి 4 గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M)) రెండూ 6 సీట్ల చొప్పున పోటీ చేసి తలా రెండు సీట్లు సాధించాయి. మనీతనేయ మక్కళ్ కట్చి (MMK) వంటి చిన్న భాగస్వామ్య పక్షాలు కూడా ఒకటి రెండు సీట్లు గెలిచి ఎస్పీఏ 159 సీట్లలో భాగమయ్యాయి.
మరోవైపు అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 75 సీట్లకే పరిమితమైంది. ఈ కూటమికి అన్నాడీఎంకే ప్రాతినిథ్యం వహించింది. ఆ పార్టీ 179 సీట్లలో పోటీ చేసి 66 గెల్చుకుంది. తమ కూటమిలో అగ్రస్ధానంలో ఉన్నప్పటికీ, డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే పూర్తిగా వెనుకబడింది. ఈ వ్యత్యాసమే రాష్ట్రంలో ఎన్నికల విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది. ఎన్డిఎ కూటమిలో పట్టలి మక్కళ్ కట్చి (PMK) 23 సీట్లలో పోటీ చేసి 5 గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) 20 సీట్లలో పోటీ చేసి 4 చోట్ల గెలిచింది. అలాగే డీఎంకే సాధించిన విజయశాతాన్ని అందుకోవడంలోనూ ఎన్డిఎ విఫలమైంది.

ఈ రెండు కూటములు కాక 234 సీట్లలో పోటీ చేసిన నామ్ తమిళర్ కట్చి (NTK)ఒక్క సీటూ గెలవలేకపోయింది. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (MNM) సుమారు 140 సీట్లలో పోటీ చేసినా ఒక్క చోటా గెలవలేదు.అమ్మా మక్కళ్ మున్నెట్ర కజగం (AMMK) కూడా సుమారు 165 సీట్లలో పోటీ చేసినా ఒక్క సీటూ గెల్చుకోలేదు. దీంతో తమిళనాడులో ద్విముఖ పోటీయే జరుగుతుందని మరోమారు నిరూపితమైంది. ఈ ఎన్నికల్లో డీఎంకే యొక్క క్రమశిక్షణతో కూడిన సీట్ల కేటాయింపులు, అధిక విజయశాతం నిర్ణయాత్మకంగా మారాయి. మరోవైపు అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి ఆ సామర్థ్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. చివరికి ఈ ఎన్నిక కేవలం ఎన్ని సీట్లలో పోటీ చేశారు అనే దాని గురించి కాదు, ఎంత ప్రభావవంతంగా పోటీ చేశారు అనే దాని గురించే అని రుజువు చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
రుణమాఫీ నిధులు విడుదల, వడ్డీ రాయితీపై కీలక ఉత్తర్వులు. -
పాత పగలు.. కొత్త పొత్తులు, తమిళనాట చిన్నమ్మ కొత్త వ్యూహం -
తమిళనాట బిగ్ షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. ఆ పార్టీకి మద్దతు.. -
తమిళనాట తెలుగు ఓటర్లు ఎవరి వైపు, విజయ్ Vs పవన్ - సీన్ ఛేంజ్: గ్రౌండ్ రిపోర్ట్..!! -
"మహిళలకు ఉచితంగా ఏసీలు.. స్టడీ లోన్ మాఫీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పుదుచ్చేరిలో డీఎంకే-కాంగ్రెస్ కు షాక్..! బీజేపీ-ఎన్నార్సీకి ఎడ్జ్..! -
ఇదేం విడ్డూరం: ఎన్నికల కమిషన్ అఫీషియల్ నోట్ పై బీజేపీ స్టాంప్: వై అండ్ హౌ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!














Click it and Unblock the Notifications