Tamil Nadu Assembly Election 2021: నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్
తమిళనాడులో హోరాహోరీగా ఎన్నికల పోరు కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. తమిళనాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో మొదటినుంచి రాజకీయ పార్టీల ఇది ఒక విభిన్నమైన శైలి. ఉచిత పథకాలతో దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది తమిళనాడు రాష్ట్రం. ఇక తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నారు.

ప్రధాన పార్టీలు డిఎంకె, ఏ ఐ ఏడి ఎం కె విడుదల చేసిన మ్యానిఫెస్టోలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కోయంబత్తూరు సౌత్ నుండి మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయగా, తాజాగా తమిళనాడు బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు.
థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
నామినేషన్ వేయడానికి ముందు ఇవాళ ఖుష్బూ సుందర్ వల్లువరుకోట్టంలో రోడ్ షో నిర్వహించారు.
మొత్తానికి సినీ ప్రముఖులు, అగ్ర తారలు, హేమాహేమీలైన రాజకీయ దిగ్గజాలు తమిళనాట తమ జెండా ఎగురవేయాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. మరి తమిళ ఓటర్లు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారింది.
పోటీ చేయబోయే 20 నియోజకవర్గాల్లో 17 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తరువాత, బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఆర్ జయసీలన్ (విలావన్కోడ్ నియోజకవర్గం), భోజరాజన్ (ఉధాగండలం), థల్లి అభ్యర్థిగా డిసి నాగేష్ కుమార్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications