శశికళ కోసం రంగంలోకి సుబ్రహ్మణ్య స్వామి, బ్యాక్ డోర్ నుంచి జంప్!
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి శనివారం నాడు తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. ఈ సందర్భంగా శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలని కోరారు.
చెన్నై: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి శనివారం నాడు తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలని కోరారు.
పూర్తి మెజార్టీ ఉన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను ఆహ్వానించాలని ఆయన మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. శనివారం గవర్నర్ విద్యాసాగర్ రావును రాజ్భవన్లో సాయంత్రం కలిశారు.
దాదాపు ఆరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. గవర్నర్ జాప్యం తగదంటూ పేర్కొంటున్న ఆయన ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు తెలిసింది. తాత్సారం చేస్తే చెడ్డ పేరు వస్తుందని చెప్పారని కూడా సమాచారం. ఇరువురు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications