జీతాల కోసం ఉపాధ్యాయల ఆందోళన: విద్యార్థులకు పాఠాలు చెప్పిన సేలం కలెక్టర్ రోహిణి !
జీతాలు పెంచాలని, వివిధ డిమాండ్లు పరిష్కారం కోసం తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయలు ఆందోళన చేపట్టారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
చెన్నై: జీతాలు పెంచాలని, వివిధ డిమాండ్లు పరిష్కారం కోసం తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయలు ఆందోళన చేపట్టారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అనేక ప్రభుత్వ పాఠశాలలకు గురువారం నుంచి తాళాలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలాయాలకు వెళ్లి అసహనంతో వెనుతిరుగుతున్నారు.
సేలంలో మాత్రం ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అక్కడ పాఠాలు చెబుతున్నది ఉపాధ్యాయులు మాత్రం కాదు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. సేలంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రోహిణి పాఠాలు చెబుతున్నారు.

ఉపాధ్యాయులు లేకపోయినా విద్యార్థులు చక్కగా పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు లేనిలోటును తీర్చి విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరో వైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ రోహిణిని తమిళనాడు ప్రభుత్వంతో పాటు ప్రజలు అభినందిస్తున్నారు జిల్లా కలెక్టర్ రోహిణి ఇప్పుడు తమిళనాడులో హాట్ టాఫిక్ అయ్యారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications