శశికళతో పన్నీర్ సెల్వం భేటీ, లైన్ క్లియర్ చేసేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి సన్నీర్ సెల్వం అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళతో పోయెస్ గార్డెన్ లో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళతో పోయెస్గార్డెన్ లో సమావేశమయ్యారు. పార్టీ శాసనసభ్యుల సమావేశానికి ముందుగా వీరిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది.
అన్నాడిఎంకె పార్టీ శాసనసభపక్ష సమావేశానికి ముందుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడిఎంకె చీఫ్ శశికళతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత కల్గిస్తోంది.

అయితే అన్నాడిఎంకె పార్టీ శాసనసభపక్ష సమావేశంలో శశికళను శాసనసభపక్ష నేతగా ఎన్నుకొంటారనే ప్రచారం సాగుతున్న తరుణంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
తాను ఓ అల లాంటి వాడినని పన్నీర్ సెల్వం చెబుతున్నారు.అయితే తాను ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగేందుకు గాను పన్నీర్ సెల్వం సుముఖంగా లేడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రెండు రోజులుగా తమిళనాడులో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ తరుణంలోనే శశికళతో పోయెస్ గార్డెన్ లో పన్నీర్ సెల్వం సమావేశం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications