Target: శ్రీమంతులు, విద్యార్థులు టార్గెట్, ఐటీ హబ్ లో రూ. 38 కోట్ల డ్రగ్స్ సీజ్, లేడీఎస్ ఎంట్రీ, సినిమా స్కెచ్
బెంగళూరు/హైదరాబాద్/ ముంబాయి: ఐటీ హబ్ లో కొందరు శ్రీమంతులు, కొందరు ఐటీ కంపెనీలు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు, విద్యార్థులను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కిపోయింది. సీక్రేట్ గా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకుని డ్రగ్స్ విక్రయిస్లు టీమ్ ఇప్పుడు కటకటాలపాలైయ్యింది. మహిళలను రంగంలోకి దింపిన స్మగ్లర్లు సీక్రేట్ గా డ్రగ్స్ విక్రయిస్తు కోట్ల రుపాయలు డబ్బులు సంపాధిస్తున్నారు. గ్రహాలు అనుకూలించకపోవడంతో కొందరు పోలీసులకు చిక్కిపోయారు. నిందితుల నుంచి ఏకంగా రూ. 38 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు. మత్తుకు బానిస అయిన వారు ఎంత డబ్బులు అడిగినా ఇచ్చేస్తారని, ఇలాంటి విషయాల్లో డ్రగ్స్ బానిసలు పోలీసులకు ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉండదని తెలుసుకుంటున్న స్మగ్లర్లు కేజీల కేజీల డ్రగ్స్ తీసుకువచ్చి అమ్మేస్తున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే కొందరు అరెస్టు కావడంతో కింగ్ పిన్ తో పాటు మరి కొందరు తప్పించుకున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.
ముంబాయి టూ బెంగళూరు
ముంబాయి నగరం, ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్, గంజాయి తీసుకువచ్చి ఐటీ హబ్ లో విక్రయిస్తున్నారని బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. ఇప్పటికే డ్రగ్స్ విక్రయిస్తున్న చాలా మందిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ముంబాయి, ఒడిశాతో పాటు అనేక రాష్ట్రాల్లో డ్రగ్స్ విక్రయిస్లున్న పెడ్లర్స్ మాత్రం పోలీసులకు చిక్కలేదు.
బెంగళూరులో వీళ్లే టార్గెట్
ఐటీ హబ్ బెంగళూరులోని కొందరు శ్రీమంతులు, కొందరు ఐటీ కంపెనీలు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు, విద్యార్థులను టార్గెట్ చేసుకున్న ముంబాయి, ఒడిశా డ్రగ్స్ పెడ్లర్స్ బెంగళూరులోని గోవిందపుర పోలీసులకు చిక్కారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను బెంగళూరు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.
ముంబాయి, చెన్నై, ఒడిశా టీమ్
ముంబాయి, చెన్నై, ఒడిశా టీమ్ ఇప్పుడు బెంగళూరు పోలీసులకు చిక్కిపోయింది. ముంబాయికి చెందిన రజని బాను గుప్తా, చెన్నైకి చెందిన ఆండ్రూ ఫిలిప్స్, రాజేష్, ఒడిశాకు చెందిన సమరకర్, రమేష్ కుముంది, ముగులు శిషా అనే నిందితులను అరెస్టు చేశామని శనివారం బెంగళూరులోని గోవిందపుర పోలీసు అధికారులు తెలిపారు. సీక్రేట్ గా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకుని డ్రగ్స్ విక్రయిస్లు నిందితులు కటకటాలపాలైయ్యింది.
రూ. 38 కోట్ల డ్రగ్స్ సీజ్..... డ్రగ్స్ వ్యాపారంలోకి లేడీస్ ?
మహిళలను రంగంలోకి దింపిన స్మగ్లర్లు సీక్రేట్ గా డ్రగ్స్ విక్రయిస్తు కోట్ల రుపాయలు డబ్బులు సంపాధిస్తున్నారు. గ్రహాలు అనుకూలించకపోవడంతో కొందరు ఇప్పుడు బెంగళూరు పోలీసులకు చిక్కిపోయారు. నిందితుల నుంచి ఏకంగా రూ. 38 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు.
ఇదే ప్లస్ పాయింట్.... ముంబాయి డ్రగ్స్ పెడ్లర్స్
ముంబాయికి చెందిన రజనీబాబు అనే డ్రగ్స్ పెడ్లర్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో డీలర్స్ ను పెట్టుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. మత్తుకు బానిస అయిన వారు ఎంత డబ్బులు అడిగినా ఇచ్చేస్తారని, ఇలాంటి విషయాల్లో డ్రగ్స్ బానిసలు పోలీసులకు ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉండదని తెలుసుకుంటున్న స్మగ్లర్లు కేజీల కేజీల డ్రగ్స్ తీసుకువచ్చి అమ్మేస్తున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే కొందరు అరెస్టు కావడంతో కింగ్ పిన్ తో పాటు మరి కొందరు తప్పించుకున్నారని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.